Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆయన లేని లోటు పూడ్చలేనిది'
Published on Tue, 06/03/2014 - 14:42
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. తన సహచరుడి మరణం తనను షాక్ కు గురిచేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. మరో కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ముండే హఠాన్మణం పట్ల ఎన్సీపీ అధినేత శరద పవార్ సంతాపం ప్రకటించారు. తన పాత స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేపోతున్నానని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ పేర్కొన్నారు. ముండే మరణం బీజేపీ, తమ పార్టీకి పెద్ద దెబ్బ అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర మంచి నాయకున్ని కోల్పోయిందని నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ట్వీట్ చేశారు.
#
Tags