amp pages | Sakshi

ప్రధాని మోదీ తాజా హెచ్చరికల మర్మం ఏమిటి?

Published on Sat, 12/24/2016 - 18:38

ముంబై: డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరుల కష్టాలు పెరుగుతాయని  స్పష్టం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మాటల వెనుక  మరిన్ని కఠిన నిర్ణయాల అమలు వ్యూహం ఉందా. నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ సెక్యూరిటీస్  మార్కెట్  (ఎన్ఎస్ఐఎం) ముంబై క్యాంపస్ లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని  చేసిన హెచ్చరికలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.  దేశ ప్రయోజనాలకోసం తమ ప్రభుత్వం  తీసుకోబోయే కఠిన నిర్ణయాలు,  స్వల్ప రాజకీయ ప్రయోజనకోసం చేసినవి కావని,  భవిష్యత్తులో మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.  ఈ విషయంలో తమకు ఎలాంటి మెహమాటం లేదనీ, డీమానిటైజేషన్ ఒక  ఉదాహరణ మాత్రమేనని వ్యాఖ్యానించడం  చర్చనీయాంశంగా మారింది.

డీమానిటైజేషన్ కష్టాలు స్వల్పకాలమేననీ, కానీ ఫలితాలు దీర్ఘకాలంగా ఉండనున్నాయని  భరోసా ఇవ్వడంతోపాటు అవినీతి, నల్లకుబేరు గుండెల్లో బాంబులు  పేల్చుతున్నారు. బ్యాంకుల్లో డబ్బు పడటంతో నల్లబాబుల కష్టాలు ముగిసినట్లు కాదని, అసలు కష్టాలు మొదలైనట్లు గుర్తించాలని  హెచ్చరించారు. చట్లంలోని లోపాలను  స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నవారు ప్రస్తుతం ఉన్నది మోదీ సర్కారనేది గుర్తుంచుకోవాలంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తమ కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని,  దీర్ఘకాలంలో ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఆర్థిక విధానాలు అనుసరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, చెందుతున్న మార్కెట్లలో అభివృద్ధి  నెమ్మదించిందని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రశాశవంతంగా నిలవనుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధిలో దేశం  ప్రపంచంలో  అత్యధికంగా  నిలవనుందని  పునరుద్ఘాటించారు. 
బ్యాంకుల్లో డబ్బు  డిపాజిట్ చేయడంతోనే అయిపోలేదన్న మోదీ తాజా హెచ్చరిక  మార్కెట్ వర్గాలను ఆలోచనలో్ పడేసింది.  దీంతో పెద్ద నోట్ల రద్దు చర్య చివరిది కాదని ..భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
 

Videos

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)