వారు ఊరు విడిచి వెళ్లిపోయారు!

Published on Fri, 05/22/2015 - 16:05

కతిహార్: కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట ప్రాణభయంతో ఊరిని విడిచి వెళ్లిపోయింది. తమ వివాహాన్ని ఆమోదించేందుకు పంచాయతీ పెద్దలు రూ. 50 వేల పన్ను విధించడంతో భయపడిన నవజంట ఊరిని వదలిపెట్టింది. బీహార్ లోని కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గోగ్రా గ్రామానికి చెందిన చోటు కుమార్ యాదవ్ తన పక్క గ్రామం రోహియాకు చెందిన సోని దేవిని కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన పంచాయతీ పెద్దలు రూ. 50 వేలు పన్ను కట్టాలని హుకుం జారీచేశారు. దీంతో భయపడిపోయిన చోటు, సోని ఊరి విడిచి వెళ్లిపోయారు. ప్రాణభయంతోనే వారు ఊరు వదిలి వెళ్లిపోయారని అరిహనా పంచాయతీ పెద్ద మహేందర్ రవిదాస్ తెలిపారు. చోటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయంతో ఇంట్లోంచి బయటకు రావడం లేదన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ