Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
'ఫేస్ బుక్ కిల్లర్'ను దోషిగా తేల్చిన కోర్టు
Published on Thu, 11/26/2015 - 09:06
మియామి: 'ఫేస్ బుక్ కిల్లర్'ను అమెరికా కోర్టు బుధవారం దోషిగా నిర్ధారించింది. అతడికి జీవితఖైదు విధించే అవకాశముంది. మియామికి చెందిన డెరెక్ మెడినా(33) తన భార్య జెన్నిఫర్ ఆల్ఫోన్సో(27)ను హత్య చేసి ఆమె ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 2013, ఆగస్టులో తన ఇంట్లోని వంటగదిలో అతడీ దారుణానికి పాల్పడ్డాడు. 8 సార్లు తుపాకీతో కాల్చి చంపాడు. అయితే కత్తితో తన భార్య బెదిరించడంతో ఆత్మరక్షణ కోసం ఆమెను హత్య చేశానని మొదట నాటకం ఆడాడు.
అయితే పోలీసులకు లొంగిపోయే ముందు జెన్నిఫర్ మృతదేహం ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తానే ఆమెను చంపినట్టు ఒప్పుకున్నాడు. 'నేను జైలుకు వెళుతున్నా. నాకు మరణశిక్ష కూడా విధించొచ్చు. ఫేస్ బుక్ మిత్రులను మిస్సవుతున్నా. మీరంతా జాగ్రత్తగా ఉండండి. నా భార్య నన్ను ఎంతగానే వేధించింది. ఆమెను ఎటువంటి వేధింపులకు గురిచేయలేదు. నన్ను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా' అంటూ ఫేస్ బుక్ లో రాసుకొచ్చాడు.
Tags