amp pages | Sakshi

అసహనాన్ని ఆమోదిస్తున్నారు

Published on Wed, 11/04/2015 - 02:26

 ప్రధాని మోదీపై సోనియా గాంధీ ధ్వజం
♦ సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సర్కారు తీరు
♦ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పార్టీ నేతలతో ర్యాలీ
♦ విద్వేషపూరిత ఘటనలపై జోక్యం చేసుకోవాలని ప్రణబ్‌కు వినతి
 
 న్యూఢిల్లీ: మోదీ సర్కారు తీరు దేశంలో సామాజిక, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ తన మౌనం తో ద్వేషపూరిత ఘటనలను ఆమోదిస్తున్నారని విమర్శించారు. దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులను నిరసిస్తూ పార్టీ నేతలతో కలసి మంగళవారం ఆమె పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. సామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలను నిరోధించేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించారు. కొన్ని సంస్థలు దేశంలో భయానక, అసహన వాతావరణం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని ప్రణబ్‌కు వివరించారు.

సమాజంలో చీలిక తీసుకువచ్చి సామరస్యాన్ని దెబ్బతీయాలన్న పక్కా ప్రణాళికతోనే ఇలా చేస్తున్నారన్నారు. ‘విద్వేష ఘటనలపై ఏమాత్రం పెదవి విప్పడం లేదు. తద్వారా వాటిని ఆమోదిస్తున్నానన్న సంకేతాన్ని పంపుతున్నారు. ఆయన మంత్రివర్గ సహచరులూ ఇదే ఎజెండాతో సాగుతున్నారు. ఈ పరిణామాలు ప్రతి ఒక్క భారతీయుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాలనే రాష్ట్రపతికి వివరించాం’ అని సోనియా విలేకరులకు తెలిపారు. ద్వేషపూరిత వాతావరణం మంచిది కాదంటూ రాష్ట్రపతి కూడా తన అభిప్రాయం వెలిబుచ్చారని, కానీ ప్రధాని మాత్రం మౌనం వీడడం లేదని అన్నారు. కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు... భిన్న సంస్కృతులు, మతాలకు ఆలవాలమైన సమాజ పునాదులపై దాడికి యత్నిస్తున్నాయన్నారు. ఈ శక్తులపై కాంగ్రెస్ అలుపెరగని పోరు చేస్తుందన్నారు.

 ఇది ప్రతి భారతీయుడి ఆందోళన: రాహుల్
 అసహనంపై రాష్ట్రపతి, ఆర్‌బీఐ గవర్నర్ ఆందోళన వెలిబుచ్చినా ప్రధాని మాత్రం నోరు మెదపడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘దేశంలో అంతా చక్కగా ఉందని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భావిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. వీరి సిద్ధాంతంలోనే సహనశీలత లేదు. అందుకే అసహనాన్ని నమ్ముతున్నారు. ఇది ఒక్క కాంగ్రెస్‌కే సంబంధించిన అంశం కాదు. ఈ పరిణామాలపై దేశంలో ప్రతి భారతీయుడు ఆందోళన చెందుతున్నాడు’ అని అన్నారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలు అసహనాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. జైట్లీ ఒక్కసారి పల్లెలకు వెళ్లి చూస్తే సమాజంలో ఏం జరుగుతోందో అర్థమవుతుందన్నారు.

అగ్నికి ఆహుతైన దళిత పిల్లలను కుక్కలతో పోల్చిన వీకే సింగ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నారు.  ఇందిరగాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై విలేకరులు ప్రశ్నించగా రాహుల్ సమాధానం దాటవేశారు. రాష్ట్రపతిని కలిసిన నేతల బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ అజాద్, ఏకే ఆంటోనీ సహా మొత్తం 125 మంది ఉన్నారు. అసహన పరిస్థితులపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసినందుకు రాష్ట్రపతికి కాంగ్రెస్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)