రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చిట్టి @ 5 కిలోలు
Published on Fri, 11/20/2015 - 03:16
అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా మూడు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఔరా అని ఆశ్చర్యపోతాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఓ మాతృమూర్తికి రెండో కాన్పుగా ఐదు కిలోల బరువు ఉన్న పాప పుట్టింది. కొత్తూరు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన యర్లంకి ప్రమీల ప్రసవ నొప్పులతో గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరగా.. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే సాయంత్రం 4 గంటల సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయమై స్త్రీ వైద్య నిపుణురాలు ప్రసూన మాట్లాడుతూ తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, మంచి పౌష్టికాహారం కారణంగా ఐదు కిలోల బరువుతో బిడ్డ జన్మించినట్టు చెప్పారు.
- పాలకొండ రూరల్
#
Tags