వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బెంగాల్ లో బోణి కొట్టిన బీజేపీ
Published on Tue, 09/16/2014 - 16:55
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టింది. తొలిసారిగా ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉత్తర 24 పరణాల జిల్లాలోని బాసిర్హత్ దక్షిణ్ నియోజకవర్గంలో పాగా వేసింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి షమిక్ భట్టాచార్య విజయం సాధించారు. తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, భారత సాకర్ మాజీ కెప్టెన్ దిపేందు బిశ్వాస్ పై 1742 ఓట్ల మెజార్టితో గెలుపొందారు.
చౌరింగ్హీ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. తృణమూల్ అభ్యర్థి నాయన బందోపాధ్యాయ తన సమీప బీజేపీ అభ్యర్థి రితేష్ తివారిని 14,344 తేడాతో ఓడించారు.
#
Tags