రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
అగ్రిగోల్డ్పై 9న హైకోర్టు ఉత్తర్వులు
Published on Tue, 10/06/2015 - 15:11
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసును శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. 300 ఆస్తుల వివరాలను అగ్రిగోల్డ్ హైకోర్టుకు సమర్పించింది. అయితే అందులో 5 ప్రధాన ఆస్తులు విక్రయానికి హైకోర్టు మంగళవారం సూత్రప్రాయంగా అంగీకరించింది. అలాగే బాధితుల కోసం రిజిస్ట్రార్ పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని హైకోర్టు పేర్కొంది. సదరు సంస్థ ఆస్తులు విక్రయించగా వచ్చిన నగదు ఈ ఖాతాలో జమ చేయాలని తెలిపింది. అవసరమైతే సంస్థకు చెందిన మొత్తం ఆస్తులు విక్రయించి... బాధితులకు చెల్లించాలని చెప్పింది.
అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులు... యాజమాన్యం శుక్రవాం హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ కేసు మొత్తం విచారణ మంగళవారం ముగిసింది. కాగా ఆస్తుల విక్రయంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యానికి హైకోర్టు సూచించింది.
Tags