amp pages | Sakshi

అక్రమంగా ఎంజాయ్‌

Published on Fri, 06/14/2019 - 09:00

భూరాబందులకు కొందరు అధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేశారు. ఆ తరువాత అమ్మి సొమ్ముచేసుకున్నారు. వాటిని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. కొన్నాళ్లకు వాటికి పట్టాలు ఇచ్చారు. రేణిగుంట మండల పరిధిలో రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ నియమించిన కమిటీ విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ భూమిని 3,470 ప్లాట్లుగా విక్రయించినట్లు తెలిసింది. వాటన్నింటికీ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు కూడా జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.  

సాక్షి, తిరుపతి: గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై చేపట్టిన భూకుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రేణిగుంట మండల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త  బుధవారం విచారణ కమిటీని నియమించారు. ఏడుగురు తహశీల్దార్లు, మరో ఏడుగురు సర్వేయర్లు ఉన్న ఈ కమిటీ  విచారణను వేగవంతంచేసింది. రేణిగుంట మండల పరిధిలో కరకంబాడి పంచాయతీ తారకరామ నగర్‌లో గురువారం పర్యటించింది.  గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్ల ప్రకారం ఒక్కొక్కరిని విచారించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, వంక, మేత, డీకేటీ భూములు ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వ, పోరంబోకు భూములను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సందట్లో సడేమియా అంటూ.. కొందరు రెవెన్యూ అధికారులు సైతం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఇతరులకు కట్టబెట్టి జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది.

అంగట్లో ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు
గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, మరికొందరు అధికారులు అక్రమాలను సక్రమం చేసుకునేందుకు ఆక్రమిత భూముల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవన్నీ ఆక్రమించుకున్న భూములే అని ఎన్నికలకు ముందే పత్రికల్లో కథనాలు రావడంతో కొనుగోలు చేసిన వారు నాయకులు, అధికారులను నిలదీశారు. తాము నిర్మించుకున్న నివాస స్థలాలు ఆక్రమించుకున్నవని పత్రికల్లో వస్తున్నాయని, ఇచ్చిన డబ్బులు వెనక్కు ఇచ్చేయమని గట్టిగా అడగడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వకపోతే తమ స్థలాలకు పట్టాలు ఇప్పించమని, లేదంటే కేసులు పెడుతామని హెచ్చరించారు. ఓ వైపు కొనుగోలు చేసిన వారు.. మరో వైపు పత్రికలో వస్తున్న కథనాలతో ఇటు టీడీపీ నేతలకు, అటు అధికారులకు దిక్కు తోచడం లేదు.

ఎన్నికలు సమీపించే ముందు ఇబ్బందులు ఎదురవుతా యని గ్రహించిన నాయకులు, అధికారులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్న వాటన్నింటికీ ‘ఎంజాయ్‌మెంట్‌’ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ప్లాటుకు రూ.2 లక్షలు, ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌కు రూ.50వేల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. ఈ లెక్కన రేణిగుంట పరిధిలో మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.86.75 కోట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు అంచనా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడితో ఆగని అక్రమార్కులు కొన్ని ప్లాట్లను రెండో వ్యక్తికి విక్రయించారు. అతనికి ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసి అప్పజెప్పారు. ఆ తరువాత పట్టా కూడా ఇచ్చి పక్కా పట్టా అని నమ్మించడం గమనార్హం.

ఈ విషయంపై కొందరు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త భూ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో వెంటనే 14 మందితో కూడిన కమిటీని వేసి విచారణ మొదలు పెట్టారు. ఈ విచారణలో నాయకులు, రెవెన్యూ అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నట్లు తెలిసింది. కమిటీ సభ్యులు విచారణ పూర్తయ్యాక కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు.  

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)