వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీఆర్ఎస్ కార్యకర్తకు మహిళల దేహశుద్ధి
Published on Tue, 05/26/2015 - 22:16
మాచారెడ్డి (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తకు మహిళలు దేహశుద్ధి చేశారు. మంగళవారం మండలంలోని గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అదే సమయంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం సీపీఎం చేపట్టిన ప్రచారయాత్ర మాచారెడ్డికి చేరుకుంది.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు నూర్జహాన్ బీడి కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆమెను అక్కడే ఉన్న ఓ టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకోబోయాడు. అంతేకాకుండా, దురుసుగా ప్రవర్తించడంతో మహిళలు మూకుమ్మడిగా అతడికి దేహశుద్ధి చేశారు.
#
Tags