వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మద్యనిషేధానికి గ్రామస్తుల ప్రతిజ్ఞ
Published on Sat, 08/29/2015 - 22:24
భైంసా రూరల్: సంపూర్ణ మద్య నిషేధానికి ఓ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుంసరా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని యువకులు, కులసంఘాలు, పెద్దలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యావంతులు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గ్రామంలో మద్యంతో ఇబ్బందులు వస్తున్నాయని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం ముట్టుకోరాదని ప్రతిజ్ఞ చేశారు. మద్యానికి దూరంగా ఉంటూ గ్రామంలో మద్యం విక్రయాలు సైతం చేపట్టకుండా ఉండాలని అంతా నిర్ణయానికి వచ్చారు.
#
Tags