amp pages | Sakshi

‘బీసీ, మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయింపు’

Published on Tue, 12/24/2019 - 18:02

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌తో పాటుగా రిజర్వేషన్లు ముందుగా ప్రకటించకపోతే అభ్యర్థుల ఎంపిక ఎలా వీలవుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికలకు గత కొన్ని నెలల నుంచి సన్నద్ధం అవుతున్నామన్నారు. జనవరి 6వ తేదీన రిజర్వేషన్లు వస్తే 8వ తేదీన నామినేషన్లు వేయడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. అధికార పార్టీకి ముందే రిజర్వేషన్లు తెలిసేలా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు, మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

అదేవిధంగా బీసీల రిజర్వేషన్లు తగ్గించినందుకు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఉత్తమ్‌ కమార్‌ మండిపడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాదైనా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి నిరుద్యోగ భృతి రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి టీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ ఇంతవరకు కేసీఆర్ అమలు చేయలేదని, రైతు బంధు సగం మంది రైతులకు కూడా అందలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ, రైతుబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు రావాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ వేవ్ మోదీ హయాంలోనే రాలేదని తన చిన్నప్పుడు ఎంత ఉందో బీజేపీ బలం ఇప్పుడు అంతే ఉందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్‌ల మధ్యనే ఉంటుందని ఎంపీ ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌