amp pages | Sakshi

రెండో అధికార భాషగా ఉర్దూ

Published on Fri, 11/17/2017 - 03:03

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ గురువారం ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉర్దూకు రెండో అధికార భాష హోదా దక్కాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది.

ఇటీవల 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్‌ గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయిం చిన ప్రభుత్వం ఈ మేరకు గురువారం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు ఉర్దూ పదాలతో కూడిన హిందీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రి తుమ్మల మాట్లాడేటప్పుడు ఉర్దూలో మాట్లాడాలని కొందరు కోరగా త్వరలో తాను ఉర్దూ నేర్చుకుంటాననడంతో సభలో నవ్వులు విరిశాయి.

ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే: అక్బర్‌
దేశంలో ఢిల్లీ తర్వాత ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన రాష్ట్రం తెలంగాణనేనని ఎంఐ ఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూ అర్జీలు తీసుకోవడంతోపాటు సంబంధిత వ్యవహారాలు చూసేందుకు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 66 పోస్టులు మంజూరు చేయడంతో ఉర్దూ భాష ఉన్నంతకాలం కేసీఆర్‌ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

తెలుగును పట్టించుకోండి: కిషన్‌రెడ్డి
ఉర్దూకు రెండో అధికార భాష హోదా ఆహ్వానించదగ్గ పరిణామమేనని, కానీ అసలు అధికార భాష తెలుగుకే ఆదరణ లేనప్పుడు ఇక ఉర్దూ గురించి చెప్పేదేముందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక చర్చ జరపాలన్నారు. కాగా, ఉర్దూను రెండో అధికార భాషగా ఖమ్మంలో కూడా అమలు చేయడం సంతోషమని కాం గ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు.  

అర్చకుల వేతన సవరణకు ఆమోదం
 దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణకు సభ పచ్చజెండా ఊపింది. సెక్షన్‌ 65–ఏ ప్రకారం దేవాలయాల నుంచి వసూలు చేసే మొత్తం, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌తో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించనున్నారు. డిసెంబర్‌ నుంచే ఇది అమలు కానుంది. ఇం దుకు సంబంధించి ధార్మిక, హిందూ మత సంస్థ, ధర్మాదాయాల చట్టం–1987కు సవరణను ప్రతిపాదిస్తూ  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. కాగా, తెలంగాణ లోకాయుక్త చట్టం– 1983కి సవరణ ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)