amp pages | Sakshi

‘నిరుద్యోగ భృతి’ని ప్రారంభించండి

Published on Thu, 04/30/2020 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ‘నిరుద్యోగ భృతి’పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రైవేటు రంగ ఉద్యోగులను తొలగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘అనేక ఐటీ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అనేక ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. లాక్‌డౌన్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఒక సంవత్సరం వరకు పరిస్థితి మెరుగుపడకపోవచ్చు. ఈ సమయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి కింద ఇవ్వాలి’అని ఆ ప్రకటనలో ఉత్తమ్‌ కోరారు. చదవండి: ‘టిమ్స్‌’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌: రేవంత్‌ రెడ్డి

లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని, తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో నమోదైన దాదాపు 24 లక్షలతో సహా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో.. తెలంగాణ రాష్ట్రం రాబోయే కొద్ది నెలల్లో నిరుద్యోగ గణాంకాలలో భారీ పెరుగుదలను చూడబోతోందని, ఈ పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండవ దశ లాక్‌డౌన్‌ ముగియడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఉత్తమ్‌ ఆ ప్రకటనలో కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం తీసుకురావాలని, తెలంగాణలో కరోనా వైరస్‌ పరిస్థితిపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)