రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతుల మృతి
Published on Thu, 10/08/2015 - 21:19
కొత్తగూడెంరూరల్(ఖమ్మం): పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు కరెంటు షాక్ తగిలి మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీ పరిధిలోని మంగపేట గ్రామానికి చెందిన రైతులు భూక్యా చందర్(32), భూక్యా స్వాములు(42) గురువారం సాయంత్రం చెరువు ఆయకట్టులోని పొలం వద్దకు వెళ్లారు.
చెరువు గట్టుపై ఉన్న మోటారు స్టార్ట్ అయ్యేందుకు ముందుగా నీళ్లు పోయాల్సి ఉంది. నీటి కోసం చెరువులో దిగిన చందర్..చేపల పెంపకందారులు చేపల దొంగలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు వైరును తాకటంతో షాక్కు గురయ్యాడు. అతడు గట్టిగా కేకలు వేయటంతో స్వాములు రక్షించబోగా అతడికి కూడా షాక్ వచ్చింది. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
#
Tags