వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సచివాలయ నిర్మాణానికి 400 కోట్లు
Published on Thu, 01/09/2020 - 03:08
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందని పేర్కొంది. సచివాలయాన్ని కూల్చి నూతనంగా అన్ని హంగులతో అత్యాధునిక వసతులతో భావితరాలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
#
Tags