వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గోదావరిలో ముగ్గురు యువకుల గల్లంతు
Published on Sun, 02/03/2019 - 01:39
బూర్గంపాడు: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన కుందూరు శ్రీనివాసరెడ్డి(21), కారంపూడి శేషు(24), తిరుమలరెడ్డి శివారెడ్డి (23) మరో ముగ్గురు మిత్రులతో కలసి గోదావరి వద్దకు వెళ్లారు. మిత్రుడు గాదె విజయ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అక్కడ విందు ఏర్పాటు చేసుకున్నారు.
శ్రీనివాసరెడ్డి, శేషు, శివారెడ్డి స్నానం చేసేందుకు నదిలోకి కొంతదూరం వెళ్లాక ఒక్కసారిగా కేకలు వేస్తూ మునిగిపోయారు. మిగిలినవారు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బూర్గంపాడు, కుక్కునూరు పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.
#
Tags