వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే!
Published on Thu, 01/29/2015 - 02:19
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే..! చార్జీల పెంపు ప్రతిపాదనలు, డిస్కంల వార్షిక ఆదాయ అవసరాల నివేదికల తయారీపై తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. రాష్ట్ర విద్యుత్తు మంత్రి సారధ్యంలో ఐదుగురు మంత్రులతో దీన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్ణీత గడువు ప్రకారం 2015-16కి సంబంధించి ఏఆర్ఆర్లను గతేడాది నవంబర్ నెలాఖరున డిస్కంలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించాలి. కానీ.. విద్యుత్తు కొరత నెలకొన్న తరుణంలో చార్జీలు పెంచాలా.. వద్దా.. అని ప్రభుత్వం వెనుకా ముందాడింది. ఇందులో భాగంగానే ఏఆర్ఆర్లు సమర్పించేందుకు డిస్కంలు వెనుకంజ వేశాయి.
నాలుగుసార్లు అదనపు గడువు కోరుతూ దాటవేస్తూ వచ్చాయి. అధికారులు 31 వరకు గడువు కోరుతూ టీఎస్ఈఆర్సీకి లేఖను రాశారు. ఈలోగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించటంతో కొత్త విద్యుత్తు చార్జీల ప్రతిపాదనలను మరింత కాలం వాయిదా వేసేందుకు పభుత్వం నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
Tags