amp pages | Sakshi

ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని హాజరుపర్చండి

Published on Fri, 04/18/2014 - 03:52

సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల్ని సిటీకి తరలించడానికి వీలుగా నాంపల్లి కోర్టు గురువారం పీటీ వారెంట్లు జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేసిన అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వఖాస్, తెహసీన్ అక్తర్‌లను వచ్చే నెల 9న హాజరుపర్చాలని స్పష్టం చేసింది.

జంట పేలుళ్లకు బాంబుల తయారీ, 107 బస్టాప్‌లో విధ్వంసానికి కారణమైన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, పాకిస్తానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతనెల 23న రాజస్తాన్‌లో అరెస్టు చేశారు. ‘దిల్‌సుఖ్‌నగర్ కేసు’లో ఇతడు మూడో నిందితుడు (ఏ-3)గా ఉన్నాడు. అలాగే, ఏ-1 మిర్చ్ సెంటర్ దగ్గర బాంబుతో కూడిన సైకిల్‌ను పెట్టి వెళ్లిన తెహసీన్ అక్తర్ అలియాస్ మోను కూడా గతనెల 25న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకే చిక్కాడు.

వీరిద్దరినీ కస్టడీకి తీసుకునే విషయంలో ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఎట్టకేలకు వీరిద్దరినీ ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సెల్ కస్టడీకే అప్పగించింది.  బుధవారం వీరి కస్టడీ పొడిగింపు పిటిషన్ విచారణ సమయంలో దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తమ దర్యాప్తు సక్రమంగా జరగకుండా ఢిల్లీ స్పెషల్ సెల్ అడ్డుపడుతూ, వేధిస్తోందంటూ ఎన్‌ఐఏ ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది.

ఈ పరిణామాల మధ్య నాంపల్లి కోర్టు ద్వారా వీరిద్దరిపై ఎన్‌ఐఏ అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఇరువురినీ వచ్చే నెల 9న సిటీకి తీసుకురాగలిగితే... మరో పిటిషన్ దాఖలు చేసి తమ కస్టడీలోకి తీసుకుని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో విచారించాలని ఎన్‌ఐఏ భావిస్తోంది. ఈ కేసులో రెండు, ఐదో నిందితులుగా ఉన్న అసదుల్లా అక్తర్, యాసీన్ భత్కల్‌లను గత ఏడాదే నగరానికి తరలించి విచారించిన విషయం విదితమే.

Videos

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)