amp pages | Sakshi

‘సాగర్’ శుద్ధి

Published on Mon, 09/01/2014 - 04:40

  •      నేటినుంచి ప్రక్షాళన పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం
  •      నిమజ్జన వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి
  •      కార్యాచరణకు దిగిన ఇంజనీరింగ్ సిబ్బంది
  •      రెండో విడతలో ‘ఆపరేషన్ గణేశా’
  • సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమయ్యే వేలాది వినాయక విగ్రహాలశకలాలను సత్వరం తొలగించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. సోమవారం ఉదయం నుంచే సాగర్‌లో నిమజ్జన వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 8వరకు తొలివిడతగా, 9నుంచి రెండో విడతగా పనులు చేపట్టనున్నారు. ‘ఆపరేషన్ గణేశా’ పేరిట రెండో విడతలో వ్యర్థాలను పెద్ద ఎత్తున వెలికి తీయనున్నారు.

    నిమజ్జన ఘట్టం ముగిసే వరకు విగ్రహాలను నీటిలో ఉంచితే సాగర్ కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం ఎప్పటికప్పుడు తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఆదివారం నుంచే నగరంలో నిమజ్జన కార్యక్రమం మొదలైనందున తొలివిడతగా సోమవారం నుంచే వ్యర్థాల వెలికితీత పనులు చేపడుతున్నారు. ఇందుకోసం 2 డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాఫ్టు (డీయూసీ)లను వినియోగించనున్నారు. డీయూసీల ద్వారా వెలికితీసి కవాడీగూడలోని జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పనుల నిమిత్తం తొలిదశలో 50 మంది వర్కర్లను, 2 డీయూసీలు, 2 జేసీబీలు, 6 టిప్పర్లను అందుబాటులో ఉంచారు.
     
    8న ప్రధాన ఘట్టం..
     
    వినాయక నిమజ్జన ప్రధాన ఘట్టం సెప్టెంబర్ 8న జరగనుంది. ఆ రోజు వేలాది సంఖ్యలో విగ్రహాలు సాగర్‌లోకి చేరుతాయి. ఇవన్నీ నీటిలో కరిగిపోకముందే వెలికి తీసేందుకు మరుసటి రోజు నుంచి భారీ ఎత్తు ప్రక్షాళన ప్రక్రియ చేపట్టనున్నారు.

    ఈ ప్రాజెక్టుకు ‘ఆపరేషన్ గణేశా’ పేరు పెట్టారు. వ్యర్థాల తొలగింపు కోసం సుమారు రూ.18.56 ల క్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 8 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసే గణేశ్ విగ్రహాల తాలూకు అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తాచెదారాన్ని సమూలంగా గట్టుకు చేర్చేందుకు 2 డీయూసీలతోపాటు, 4 జేసీబీలు, ఒక పాంటాన్ ఎక్స్‌కవేటర్, 20 టిప్పర్లు, 200మంది వర్కర్లను వినియోగించి రాత్రింబవళ్లు నిరంతరాయంగా పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ బీఎల్‌ఎన్ రెడ్డి తెలిపారు. జనాల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై కొంత అవగాహన పెరిగినా... ఈ ఏడాది 3,740 టన్నుల వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
     

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)