amp pages | Sakshi

ఆనందం ఆవిరి

Published on Sat, 10/25/2014 - 00:24

  •  దీపావళిలో అపశ్రుతులు
  •  పలువురికి గాయాలు
  •  సరోజిని,ఎల్వీప్రసాద్,ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స
  • బంజారాహిల్స్/మెహిదీపట్నం/అఫ్జల్‌గంజ్: దివ్వెల పండుగ దీపావళి రోజు అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. అజాగ్రత్తగా టపాసులు కాల్చడంతో దీపావళి ఆనందం ఆవిరైంది.  నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు చిన్నారులు టపాసులు కాలుస్తూ ప్రమాదాల బారిన చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేరారు. కొందరి కళ్లకు గాయాలయ్యాయి. సున్నితమైన కార్నియా వంటి భాగాలు దెబ్బతిన్నాయి.

    నగర వ్యాప్తంగా పలు చోట్ల గాయపడ్డ 45 మందికి గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించారు. వారిలో స్వల్పంగా గాయపడి కంటి సంబంధమైన బాధను ఎదుర్కొంటున్న  40 మందికి ప్రాథమిక చికిత్స అందించి పంపేశారు. మిగతా ఐదుగురికి  శస్త్రచికిత్స చేశారు. శ్రుతి అనే బాలిక చిచ్చుబుడ్డి కాలుస్తుండగా కుడి కంటికి గాయమైంది.  కార్నియాకు దెబ్బతగలడంతో శస్త్రచికిత్స చేసి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురికి కూడా కార్నియా దెబ్బతినడంతో శస్త్ర చికిత్స చేశారు.
     
    ‘సరోజిని’లో ప్రత్యేక వార్డు...

    మరోవైపు మెహిదీపట్నం సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ఇలాంటి బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.  తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రి చేర్చుకున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ నర్సారెడ్డి తెలిపారు. చిన్నారులు కూకట్‌పల్లికి చెందిన ఇబ్రహీం, మెదక్ రంగంపేట్‌కు చెందిన పవన్, సైదాబాద్‌కు చెందిన సందీప్, మహబూబ్‌నగర్ నారాయణపేట్‌కు చెందిన వేణులు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరి కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేకపోయినప్పటికీ  తీవ్ర గాయాలయ్యాయని సూపరింటెండెంట్ తెలిపారు. స్వల్పంగా గాయపడి ఆసుపత్రికి వచ్చిన మరో 35 మందికి చికిత్స చేసి పంపేశారు.
     
    ఉస్మానియాలో 10 మందికి చికిత్స...

    నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 10 మంది టపాకాయలు కాలుస్తూ  గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. వారికి  కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. స్వల్ప గాయాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించి పంపేశారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు  చికిత్సలు పొందిన వారిలో బేగంబజార్‌కు చెందిన జగదీష్(13), అభిషేక్(15) శ్రీకాంత్(21), మంగళ్‌హాట్ జాలిహనుమాన్‌కు చెందిన అనిరుథ్(8), మంగళ్‌హాట్‌కు చెందిన బాలు(18), లక్ష్మీబాయి (35), నింబోలిఅడ్డకు చెందిన నాగార్జున్ (11), చుడీబజార్‌కు చెందిన అజయ్‌కుమార్(13), నాంపల్లికి చెందిన సాయికుమార్(24), ఘాన్సీ బజార్‌కు చెందిన సాయిచంద్ర(22) ఉన్నారు.
     

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌