నిరుపేదలకు వరం

Published on Mon, 08/31/2015 - 04:42

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద హౌస్ ఫర్ ఆల్ పథకంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను ఎంపిక చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే 100 స్మార్ట్‌సిటీలను, 500 అమృత్ సిటీలతోపాటు ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన (పీఏవై) కింద అందరికీ ఇల్లు పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పీఏవై పథకం కింద దేశంలో 305 పట్టణాలను ఎంపికచేసి 2 కోట్ల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పథకాన్ని రూపొందించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2022 సంవత్సరం వరకు ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 34 నగరాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవకాశం లభించింది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు సిరిసిల్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట నగర పంచాయతీలు పీఏవై కింద హౌసింగ్ ఫర్ ఆల్ పథకానికి ఎంపికయ్యాయి. పట్టణాల్లో నిరుపేదలు నివసించే మురికి వాడలను గుర్తించి అక్కడి నివాసుల స్థలాల్లోనే ఇళ్ల పునర్నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఒక్కో ఇంటికి స్థానిక పరిస్థితులను బట్టి రూ.లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో 3.5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశముంది. స్మార్ట్‌సిటీలు, అమృత్ సిటీలగా ఎంపికైన నగరాలకు సైతం ఈ పథకం వర్తిస్తుంది. కరీంనగర్ అమృత్‌కు ఎంపికైనప్పటికీ పీఏవై పథకం వర్తిస్తుండడం ఇండ్లు లేని నిరుపేదలకు వరంలా మారనుంది.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)