amp pages | Sakshi

బట్టలు చించేలా కొట్టారు..

Published on Sat, 10/12/2019 - 11:59

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం మాట్లాడితే వాళ్లను బట్టలు చించేలా కొట్టారని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ జనసమితి, సీపీఐ, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఉదయం బస్‌భవన్‌ను ముట్టిడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బస్‌భవన్‌ ముందు బైఠాయించి ఆందోళనకారులు ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా సంధ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. విలీనం చేయకపోగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఆర్టీసీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో విసిగిపోయిన కార్మికులు సమ్మె చేపట్టారని, వీరికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. చర్చల కమిటీని మొదటి రోజే ఎలా రద్దు చేస్తారు? చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు తీసేస్తామంటూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను దెబ్బదీసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం తెగించి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు అన్ని వర్గాలు ముందుకు రావాలని సంధ్య పిలుపునిచ్చారు.


కేసీఆర్‌.. ‘సెల్ప్‌ డిస్మిస్‌’ అర్థం చెప్పు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెల్ప్‌ డిస్మిస్‌ పదానికి అర్థం చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాల్లో సెల్ప్‌ డిస్మిస్‌ అనే పదం లేదన్నారు. రాజ్యాంగం, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ మాట్లాడుతున్న తీరు  కార్మిక వర్గాలకు పెను సవాల్‌ విసురుతోందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘాలన్ని ఏకమై కేసీఆర్‌ మెడలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్‌టీసీ, సీపీఎంఎల్‌ కూడా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నాయని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే నాలుగురైదుగురు ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారని, 1200 మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో ప్రజలకు జవాబు చె​ప్పాలని డిమాండ్‌ చేశారు.

కార్మికులకు అండగా ఉంటాం: టీజేఎస్‌
ఆర్టీసీ కార్మికులకు చివరి వరకు అండగా ఉంటామని తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) నాయకులు స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెలో జీవితాలను సైతం లెక్కచేయకుండా పాల్గొని ఆర్టీసీ కార్మికులు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)