amp pages | Sakshi

‘వీవీ’లు ఓకే.. 

Published on Thu, 06/13/2019 - 07:12

ఖమ్మంసహకారనగర్‌/నేలకొండపల్లి: ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల(వీవీ)ను నియమించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత విద్యా సంవత్సరం పని చేసిన వారిని రెన్యువల్‌ చేసేందుకు అనుమతిచ్చింది. జిల్లావ్యాప్తంగా 471 మంది విద్యా వలంటీర్లను కొనసాగించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు లేని జిల్లాలోని 6 పాఠశాలలకు కొందరిని అత్యవసరంగా నియమించగా.. రెండు, మూడు రోజుల్లో మిగతా పాఠశాలల్లో వీరిని నియమించనున్నారు.

జిల్లాలో 1,294 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,98,944 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో బాలికలు 96,936 మంది ఉండగా.. బాలురు 1,02,008 మంది ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ అందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో మాత్రం ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదికేడాది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్త టీచర్ల నియామకం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఒక్క ఉపాధ్యాయుడే రెండు, మూడు తరగతులకు బోధించాల్సి వస్తోంది. లేనిపక్షంలో విద్యావలంటీర్లతోనే ఎలాగోలా నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి.   
తీర్పునకు అనుకూలంగా..  
రాష్ట్రవ్యాప్తంగా విద్యా వలంటీర్లను ప్రతి ఏటా రెన్యువల్‌ చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులను భర్తీ చేసేవరకు వీరిని ఏటా రెన్యువల్‌ చేయాలని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో విద్యా శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. అయితే ప్రభుత్వం రెన్యువల్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 471 మంది విద్యా వలంటీర్లను రెన్యువల్‌ చేయనున్నారు. మండలాలవారీగా ఉద్యోగ విరమణ పొందనున్న ఉపాధ్యాయులు, ఏర్పడనున్న ఖాళీలు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు, ఇతర కారణాలతో ఖాళీలు, ఇతర అవసరాల రీత్యా వలంటీర్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని డీఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓలకు ఆదేశాలు అందాయి.
 
ఈసారి కూడా..  
గత ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు అనేక మంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈ ఏడాది విద్యావలంటీర్లు అదనంగా అవసరం అవుతారనే ఆలోచనలో విద్యా శాఖ ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది దాదాపు 731 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉంటుందని గుర్తించారు. ఈ మేరకు అంతమందిని నియమించుకునేందుకు అనుమతి కోరుతూ జిల్లా విద్యా శాఖ.. ఉన్నతాధికారులకు నివేదికను పంపించింది. అయితే ప్రస్తుతానికి 471 మంది విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు ఆమోదం లభించింది.
 
అందని వేతనాలు.. 
2018–19 విద్యా సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా విద్యా వలంటీర్లకు ప్రతి నెలా వేతనాలు అందలేదు. మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు జమ చేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ 12వ తేదీ వరకు వేతనాలు అందించాల్సి ఉంది. నెలకు రూ.12వేల చొప్పున పెండింగ్‌ వేతనాలు రావాల్సి ఉంది. విద్యా సంవత్సరం ముగిసి, తిరిగి ప్రారంభమైనా నేటి వరకు వేతనాలు అందలేదంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా.. సమాన వేతనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించు కుని నెలనెలా వేతనాలు జమ చేయాలని కోరుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)