amp pages | Sakshi

కందులు కొంటాం రండి!

Published on Wed, 02/26/2020 - 02:29

సాక్షి, హైదరాబాద్‌: కందుల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా అదనంగా 56 వేల మెట్రిక్‌ టన్నుల కందు లు కొనుగోలు చేయడానికి అనుమతినిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు 47,500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. మరో 56 వేల మెట్రిక్‌ టన్నులు కొనాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో తానే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్రం వాటాలు కలిపి మొత్తం 1,03,500 మెట్రిక్‌ టన్నుల కందుల కొనుగోళ్లకు అనుమతి లభించినట్లయింది. ‘కంది.. రంధి’శీర్షికతో ‘సాక్షి’ఈ నెల 21న కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

రూ.381 కోట్లు కేటాయింపు..
అదనపు కందుల కొనుగోలు కోసం అనుమతించాలని కోరుతూ మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం 2019–20 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర వాటా కింద 56 వేల మెట్రిక్‌ టన్నుల కంది కొనుగోళ్లను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మొక్కజొన్న కొనుగోలు కోసం మంజూరు చేసిన రూ.1,500 కోట్ల రుణా ల్లో మిగిలిన రూ.381 కోట్లను కందుల కొనుగోలుకు వినియోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వాటా కందుల కొనుగోలు సందర్భంగా ఎలాంటి ఆర్థిక నష్టాలు వచ్చినా అంతే మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కందుల కొనుగోళ్లు నేరుగా రైతుల నుంచే చేపట్టాలని, మధ్య దళారులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఆన్‌లైన్‌లో పేరు లేకున్నా కొనాల్సిందే..
కంది కొనుగోళ్లకు సంబంధించి సజావుగా సేకరించడానికి తామిచ్చే మార్గదర్శకాలను పాటించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాశారు. వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కంది రైతుల పేర్లు లేకపోయినా, కందులు కొనాలని ఆయన ఆదేశించారు. నిజమైన రైతులను గుర్తించడానికి జిల్లా స్థాయి ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ (డీఎల్‌పీసీ) సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈవో, వీఆర్వోలు ఇచ్చే ధ్రువీకరణతో మండల వ్యవసాయాధికారి ధ్రువీకరణ ఉంటేనే ఆయా రైతుల కందులను కొనాలని ఆయన ఆదేశించారు. సేకరణ కేంద్రాల నుంచి 50 కిలోమీటర్ల లోపల గోదాముల్లో నిల్వ చేయాలన్నారు. నిబం ధనల ప్రకారం వ్యవహరించకుంటే కఠిన చర్యలుంటాయని ఆయన వ్యవసాయాధికారులను హెచ్చరించారు. వ్యవసాయ, రెవెన్యూ, సహకార, మార్కెటింగ్, పోలీస్‌ విభాగాల సమన్వయంతో జిల్లా స్థాయి విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు చేయాలన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)