amp pages | Sakshi

కరువు నేలకు కల్పతరువు

Published on Mon, 10/01/2018 - 02:12

సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాలు జనగామ, సిద్దిపేట జిల్లాలకు తపాస్‌పల్లి రిజర్వాయర్‌ కల్పతరువుగా మారింది. ఈ జిల్లాల్లోని బీడు భూములకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి వద్ద రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసి సాగునీరు అందిస్తున్నారు.  

54 చెరువులకు ఆధారం.. 
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నుంచి ఏటా సిద్దిపేట, జనగామ జిల్లాల్లోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, కొండపాక మండలాల్లోని సుమారు 54 చెరువులను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం 0.3 టీఎంసీ కాగా, మరో 1.2 టీఎంసీలను గోదావరి జలాలతో ఈ 5 మండలాల్లోని చెరువులకు తరలిస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు తాగునీటి కోసం కొమురవెల్లిలోని 13 చెరువులు, చేర్యాలలో 8, మద్దూరులో 1, కొండపాకలో 7 చెరువులు, బచ్చన్నపేటలోని 25 చెరువులు నింపారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మరిన్ని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో... 
సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తరలించాలంటే ఎత్తిపోతలే మార్గం.. దీన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2007లో తపాస్‌పల్లి ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారు. 65 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీని నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్‌ హయాం తర్వాత పెద్దగా పనులు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుల సహకారంతో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్‌ కింద 82,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.  

25 శాతం పనులు పెండింగ్‌లోనే... 
2007లో ప్రారంభించిన తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో ఇప్పటికీ 75 శాతం పనులే మాత్రమే పూర్తయ్యాయి. మరో 25 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 

కష్టాలు తీరాయి.. 
గోదావరి జలాలతో తపాస్‌పల్లి రిజర్వా యర్‌ను నింపి, తద్వార చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో కరువు ప్రాంతమైన సాగుకు అనుకూలమైంది. ఏటా చెరువులు నింపడంతో వ్యవసాయం చేయడానికి నీళ్ల కష్టం తొలగిపోయింది. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు.  
 – మెరుగు క్రిష్ణ , రైతు ఐనాపూరు

కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి  
రిజర్వాయర్‌ ఎడమ, కుడి కాల్వలు, ఉపకాల్వలను పూర్తిచేసి సాగునీరు అందించాలి. మెయిన్‌ కాల్వలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే కాల్వల నిర్మాణం పూర్తి చేసి పొలాలకు నీరందించాలి.  
 – చెరుకు రమణారెడ్డి, ఐనాపూర్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)