అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అమ్మో కారు..
Published on Tue, 10/10/2017 - 14:52
ఇబ్రహీంపట్నంరూరల్: అడవిలో అనుమానాస్పద స్థితిలో నిలిపివేసిన కారు కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా అడవిలో ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కారులో ఎమన్నా ఉందా అని భయపడుతున్నారు. మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో ఏ నోట విన్నా కారు గురించే. వివరాల్లోకి వెళితే.. నాగన్పల్లి గ్రామం శివారులోని మూల మలుపు వద్ద ఉన్న దాసర్రాయి సమీపంలోని చెట్ల పొదల్లో మారుతీ 800 కారు నిలిపి ఉంది. గత నాలుగు రోజులుగా అక్కడే ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. సోమవారం కొందరు యువకులు ధైర్యం చేసి కారు వద్దకు వెళ్లి చూశారు. కారు నెంబరు ఏఐడబ్ల్యూ–9495 నెంబరు కలిగి తెల్లరంగు కారును గుర్తించారు. నాలుగు చక్రాలలో గాలిపోయి ఉంది. కారు కనెక్షన్లు తొలగించి ఉన్నట్లు యువకులు గుర్తించారు.
#
Tags