amp pages | Sakshi

ఆసుపత్రిపై కమాండ్‌ & కంట్రోల్‌

Published on Mon, 05/27/2019 - 02:56

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా శాంతిభద్రతలను ఎలాపర్య వేక్షిస్తున్నారో అలాగే వైద్యఆరోగ్యశాఖలోనూ ఏర్పాటు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), జిల్లా ఆసుపత్రి, బోధనాసు పత్రి ఇలా అన్ని రకాల ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల కు అందుతున్న సేవలన్నింటిపైనా నిరంతర పర్య వేక్షణకు ఈ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఈటల రాజేం దర్‌ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల ని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మంగళవారం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థపైనా సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నారు.

ఆసుపత్రులు ఎన్నింటికి తెరుస్తున్నారు? సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా? డాక్టర్లు ఎన్ని గంటలకు వస్తున్నారు? రోగులు ఎంత సేపటి నుంచి వేచి చూస్తున్నారు? రోగుల పట్ల వైద్య సిబ్బంది తీరు ఎలా ఉంటుందో మొత్తం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా వీక్షించవచ్చు. అందుకోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటినన్నింటినీ హైదరాబాద్‌ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. అవసరమైతే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్‌లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించాలన్నదే ఉద్దేశమని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. 

మందుల ట్రాకింగ్‌...
రాష్ట్రంలో 900 పైగా పీహెచ్‌సీలున్నాయి. 31 జిల్లా ఆసుపత్రులున్నాయి. ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ బోధనాసు పత్రులున్నాయి. ఏజెన్సీ ఏరియా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలుపెడితే హైదరాబాద్‌ గాంధీ, ఉస్మానియా బోధనాసుపత్రి వరకు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులనూ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. వైద్య ఆరోగ్యశాఖలోని జిల్లా, రాష్ట్రస్థాయి పరిపాలనా వ్యవస్థలనూ అనుసంధానం చేసే వీలుం ది. ఉదాహరణకు హైదరాబాద్‌ నీలోఫర్‌లో చిన్న పిల్లలకు పడకలు లేక అనేక సందర్భాల్లో ఆరుబయట ఉంచడం, కింద పడుకోబెట్టడం వంటివి జరుగుతున్నాయి.

ఇలాంటి వాటిపై పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే పరిస్థితి ఉండటం లేదు. కానీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా  చూసి తక్షణమే సంబంధిత వైద్యాధికారితో పరి స్థితిని చక్కదిద్దుతారు. డ్రగ్‌ కంట్రోల్‌ కేంద్రాల నుంచి ఏఏ మందులు ఎన్నె న్ని ఆసుపత్రులకు వెళ్తున్నాయో కూడా జీపీఎస్‌  ద్వారా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకూ అనుసంధా నం చేస్తారు. ఎక్కడికైనా తరలి వెళుతున్నాయా? నిర్దేశిత ఆసుపత్రికే వెళుతున్నాయా? వెళితే ఎంతెంత వెళుతున్నాయో కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.

ఇక ఇండెంట్‌ ప్రకారమే మందులు వెళుతున్నాయా లేదో కూడా చూస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన మందులున్నాయా అని రోజూ ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు. ఇటీవల నాంపల్లి యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అనంతరం వేసిన ట్రెమడాల్‌ మాత్ర వికటించి ఇద్దరు పిల్లలు చనిపోయిన నేపథ్యంలో అనవసర మాత్రలు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సేవలు అందాలన్నదే ఉద్దేశమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. 

ఉన్నతాధికారిపై సర్కార్‌ సీరియస్‌
లక్ష్యం మేరకు వైద్య ఆరోగ్యశాఖలోని ఒక ఉన్నతాధికారి సరిగా పనిచేయక పోవడంతో సర్కారు సీరియస్‌గా ఉంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌ నిర్వ హించిన సమీక్షలోనూ ఆ అధికారి వ్యవహార శైలిపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే మనస్తాపానికి గురై ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా కేసీఆర్‌ కిట్‌ అమలు తీరులో సరిగా వ్యవహ రించకపోవడం, ఇప్పటికీ చాలాచోట్ల కిట్‌ సొమ్ము అం దకపోవడం, నాంపల్లి యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అనం తరం వేసిన ట్రెమడాల్‌ మాత్ర వికటించిన ఘటనలో ఇద్దరు పసి పిల్లలు చనిపోవడం తదితర అంశాలపై ఆ అధికారి వ్యవహరించిన తీరుపట్ల సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలి సింది. పైగా ఉద్యోగులతోనూ కఠినంగా ఉంటున్నారని, కొందరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలూ కూడా ఈ పరిస్థితికి కారణమని తెలి సింది. అయితే ఆ అధికారి పేషీకి సంబంధించిన సిబ్బంది మాత్రం వేసవి సెలవులకు వెళ్లారని చెబుతున్నారు. ఉన్నతస్థాయి వర్గాలు మాత్రం దీనిపై స్పందించడంలేదు. 

Videos

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)