amp pages | Sakshi

‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 

Published on Thu, 07/18/2019 - 01:33

సాక్షి, హైదరాబాద్‌: పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన కొత్త మునిసిపల్‌ చట్టాల ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదించింది. కొత్త మునిసిపాలిటీల చట్టం, కార్పొరేషన్ల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల చట్టం, టౌన్‌ప్లానింగ్‌ చట్టంతో కూడిన ముసాయిదా బిల్లును సీఎం కేసీఆర్‌ గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టను న్నారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో చర్చించి కొత్త మునిసిపల్‌ చట్టాల బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. కొత్త మునిసిపల్‌ చట్టాల బిల్లుకు ఆమోదంతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది.

ఈ సుదీర్ఘ భేటీలో కొత్త మునిసిపల్‌ చట్టాల ముసాయిదా బిల్లుపై చర్చ నిర్వహించారు. కొత్త మునిసిపల్‌ చట్టాలను తీసుకురావడం ద్వారా పురపాలనలో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిర్మూలనతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై  చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ కొత్త చట్టాలను రూపొందించినట్లు సీఎం కేసీఆర్‌ మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. హరితహారం   కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో కనీసం 85% వాటిని సంరక్షించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని కొత్త చట్టాల్లో పొందుపరిచినట్లు సమాచారం. మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లను పదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర శివార్లలోని కొన్ని మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం లేదా వాటిని కొత్త మునిసిపల్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అంశాన్నీ కేబినేట్‌లో చర్చించినట్లు తెలిసింది.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 
- వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ రూ.1,000 నుంచి రూ.2,016కు పెంపు.  
దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ రూ.1,500 నుంచి 3,016కు పెంపు. ఈ పింఛన్‌ జూన్‌ నుంచి అమలు. జూలై నుంచి లబ్ధిదారులకు అందజేత. 
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామనే టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీని అమలుకు నిర్ణయం. 

మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు
- రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఇతరులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 
- వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పింఛన్‌ను 2019 జూన్‌ నుంచి అమలు చేస్తారు. జూలై నెలలో లబ్ధిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్‌ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్ధిదారుల పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. 
- వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పింఛను అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 
- బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం (17–07–2019) నాటి వరకు కూడా పీఎఫ్‌ ఖాతా ఉన్న కార్మికులకు పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించింది. 
- రుణ ఉపశమన కమిషన్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ బిల్లుతో పాటు పాత మునిసిపల్‌ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ బిల్లును సైతం మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)