amp pages | Sakshi

నెలలో వారం పల్లెల్లోనే..

Published on Fri, 08/22/2014 - 01:22

బీజేపీ పదాధికారులకు అమిత్ షా నిర్దేశం
కష్టపడే వారే బాధ్యతలు తీసుకోవాలి.. అందరి పనితీరూ పరిశీలిస్తా
ఒకప్పుడు గుజరాత్‌లో పార్టీ పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఉంది
అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి

 
సాక్షి, హైదరాబాద్: పార్టీ పదాధికారులు ఇకపై నెలలో వారం రోజులు గ్రామాల్లోనే గడపాలని, రాత్రి బస కూడా అక్కడే చేయాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్దేశించారు. నేతలెవరూ పార్టీ కార్యాలయానికే పరిమితం కావద్దని, గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడే వారినే పదాధికారులుగా ఉండాలన్నారు. అందరి పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తానని, నెలలో వారం రోజులు దక్షిణాదిలోనే ఉండి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. గురువారం రాత్రి ఆయన పంజాగుట్టలోని సెస్ ఆడిటోరియంలో పార్టీ తెలంగాణ పదాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ.. పార్టీ నేతలకు సూటిగా, స్పష్టంగా సూచనలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని అందిపుచ్చుకోవటానికి నేతలు బాగా శ్రమపడాలని పేర్కొన్నారు. 1985లో గుజరాత్‌లో పార్టీని అధికారంలోకి తేవడానికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. వెరసి గుజరాత్ నమూనాను తెలంగాణలో అమలు చేయనున్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు.
 
కొందరు నేతలు వేసిన ప్రశ్నల ఆధారంగా అమిత్ షా చేసిన కీలక సూచనలు ఇలా ఉన్నాయి.
1985లో గుజరాత్‌లో ఉన్న పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఉంది. అప్పట్లో అక్కడ బీజేపీకి కేవలం 9 మంది ఎమ్మెల్యేలుండేవారు, తెలంగాణలో ఐదుగురున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించడాన్ని పరిశీలిస్తే 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
 
పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున అక్కడి నుంచి నిధులు కావాలనో, రాష్ట్రానికి ప్రాజెక్టులు కావాలనో అడక్కండి. రాష్ట్రానికి, ప్రజలకు ఏం కావాలో అది ప్రభుత్వం చూసుకుంటుంది. కేంద్రంపై ఆధారపడి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనను విరమించుకోండి. అసలు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్నే మర్చిపొండి.
 
వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులుండాలా వద్దా అన్నది నేను చూసుకుంటా. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తే అసలు పొత్తుల అవసరమే ఉండదు. వాస్తవానికి నేను పొత్తు విధానానికి వ్యతిరేకిని. పార్టీని మీరు పటిష్టం చేయకపోతేనే పొత్తు ప్రస్తావన వస్తుంది.
 
ఏడాది పొడవునా పార్టీ కార్యక్రమాలు ఉండేలా కార్యాచరణను సిద్ధం చేయండి. దానికి తగ్గుట్టుగానే కార్యక్రమాలు కొనసాగించండి. వీటిని పరిశీలించేందుకు మూడు నెలలకోమారు ఢిల్లీ నుంచి పరిశీలకులను పంపుతాను. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలించండి. ప్రజావ్యతిరేక అంశాలుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.
 
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు సంబంధించి తొలుత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని సీరియస్‌గా పరిగణించి పని ప్రారంభించండి.
 
సంస్థాగతంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పటిష్టం కావాలి.
 
నేడు చంద్రబాబుతో అమిత్‌షా భేటీ
 భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీవర్గాలు తెలిపాయి. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వారు చర్చించే అవకాశముందని ఆ వర్గాలు చెప్పాయి.
 
టీఆర్‌ఎల్‌డీ విలీనం
భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ విలీనమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో గురువారం టీఆర్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ విలీనాన్ని ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఉన్న దిలీప్‌కుమార్ గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎల్‌డీని ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌కు అనుబంధంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ను ఏర్పాటుచేశారు. దిలీప్‌కువూర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, భువనగిరి లోక్‌సభా స్థానానికి కూడా టీఆర్‌ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యూరు.

Videos

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)