amp pages | Sakshi

శంఖారావానికి సిద్ధం

Published on Thu, 09/27/2018 - 12:45

సాక్షి, మెదక్‌: ముందస్తు ఎన్నికల ప్రచారానికి బీజేపీ తెరతీసింది. జిల్లా పరిధిలోని చేగుంటలో గురువారం ‘మహిళా శంఖారావం’ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతిఇరానీ హాజరుకానున్నారు. 25 వేల మంది మహిళలతో భారీఎత్తున ఈ శంఖారావ సభను నిర్వహిస్తున్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీతోపాటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు హాజరుకానున్నారు. సభ విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్‌రావు కృషి చేస్తున్నారు.  జిల్లాలోని అన్ని ప్రాంతాలతోపాటు దుబ్బాక నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరిస్తున్నారు.

వారం రోజులుగా 100 మందితో ఏర్పడిన మహిళా బృందాలు జిల్లాలో ఇంటింటికీ తిరుగుతూ మహిళా శంఖారావసభను విజయవంతం చేయాలని ప్రచారం చేస్తున్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, జిల్లా అధ్యక్షురాలు శైలజ సభకు హాజరు కావాలని బొట్టుపెట్టి  మరీ ఆహ్వానిస్తున్నారు. 25వేల మందికంటే ఎక్కువ మంది మహిళలు సభకు హాజరవుతారని ఆకుల విజయ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాతోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి కూడా మహిళలను, బీజేపీ శ్రేణులను తరలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి స్మృతీఇరానీ హైదరాబాద్‌ నుంచి చేగుంట చేరుకుంటారు. 2.30 గంటలకు సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు పయణమవుతారు.

స్మృతిఇరానీ పర్యటనపై భారీ ఆశలు
స్మృతి ఇరానీ పర్యటన జిల్లాలో పార్టీకి లాభిస్తుందని బీజేపీ నాయకత్వం ఆశిస్తోంది.  ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందె.  ఆ తర్వాత  చేగుంట నుంచి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో బీజేపీ నాయకత్వం స్మృతి పర్యటనను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నారు. సభలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి  ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళల సమస్యలపై ఎక్కువగా తన ప్రసంగంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్మృతి ఇరానీ పర్యనటతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండటంతోపాటు ఓటర్లు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతారని బీజేపీ నేతల అంచనా. ఈ పర్యటనతో మెదక్, నర్సాపూర్, దుబ్బాక నియోజవర్గాల్లో పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

వైఫల్యాలను ఎండగడతాం
ఈ సభ ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తెలిపారు. మహిళా శంఖారావసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆమె మాట్లాడుతూ కేంద్ర మంత్రి  పర్యటన ఉమ్మడి మెదక్‌ జిల్లా బీజేపీకి బలం చేకూరుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.  సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కేసీఆర్‌ తన కేబినెట్‌లో మహిళకు స్థానం కల్పించకుండా  మహిళల పట్ల తనకున్న చిన్నచూపును చాటిచెప్పారని విమర్శించారు. ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. చేగుంటతోపాటు త్వరలో ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మహిళా మోర్చా ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)