amp pages | Sakshi

ప్రభుత్వ ఖజానాకు తూట్లు

Published on Thu, 08/30/2018 - 14:04

    సీజ్‌ చేసిన 
    ఇసుకరాçశులు మాయం
     రాత్రికి రాత్రే ట్రక్కులతో 
    ఇసుక తరలింపు
     ఉదాసీనగా వ్యవహరిస్తున్న
    రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగంమరిపెడ రూరల్‌: చిన్నగూడూరు మండల కేంద్రంలోని సీజ్‌ చేసిన ఇసుక రాత్రికి రాత్రే మాయమవుతుంది. అధికారుల కళ్లు కప్పి సీజ్‌ చేసిన ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్‌ వ్యక్తులు రహస్యంగా ఇసుక డంపులు నిల్వ చేసి రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడి రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం ఉదాసీనతగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిన్నగూడూరు మండల కేంద్రం శివారులో ఆకేరు వాగులోని ఇసుకపై కన్నేసిన కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా గ్రామంలోనే పలు రహస్య ప్రాంతాల్లో ఇసుక డప్పులను నిల్వ చేస్తారు. మరికొందరు ట్రాక్టర్ల ద్వారా పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటారు. 
ఇసుక డంప్‌లు సీజ్‌..
చిన్నగూడూరు మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన డంపులున్నట్లు సమాచారం తెలుసుకున్న చిన్నగూడూరు రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం దాడులు నిర్వహించి సుమారు 14 ఇసుక డంపులను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన ఇసుక రాసుల నిఘా వైఫల్యం చెందడంతో వాటిపై కొందరు కన్నెశారు. అదును చూసి ఇసుక రాసుల్లో నుంచి ట్రాక్కుల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆకేరు సమీపంలోని రహాస్య ప్రదేశాల్లో మరిన్ని పెద్ద పెద్ద ఇసుక రాశులు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఈ ఇసుక డంపుల నుంచి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
మరికొందరు గృహాలు నిర్మించుకుంటున్నామని చెబుతూ దర్జాగా ఇంటి ముందే ఇసుక డంప్‌ నిల్వలు చేసుకొని అమ్ముకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ట్రక్కు ఇసుక రూ.4 వేలు ఉండటంతో ఇసుక అక్రమార్కుల సంపాదన మూడు పువ్వులు ఆరుకాయల చందంగా వారి వ్యాపారం కొనసాగుతుంది. ఈ తతాంగం అంతా కూడా కొందరి అధికారుల కనుసైగల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీజ్‌ చేసిన ఇసుక డంప్‌ల నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ అధికారులు ఇటీవల పట్టుకున్నారు. ప్రభుత్వ ఇసుక తరలిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే జరిమానా వేసి వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అడుగంటుతున్న భూగర్భజలాలు..
ఆకేరు వాగు నుంచి తోడుతున్న ఇసుక కారణంగా ఆ ప్రాంతంలోని భూగర్భజలాలు అడుగంటుకుపోయి వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారుతోంది. వేసవిలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిన్నగూడూరు ఇసుక మాఫియాపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.సీజ్‌ చేసిన ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్‌  

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌