amp pages | Sakshi

టీఆర్‌ఎస్‌తోనే ముస్లింల అభ్యున్నతి

Published on Mon, 02/04/2019 - 01:40

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యమని, రాష్ట్రంలోని మైనార్టీ పిల్లలకోసం కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్నట్లుగా దేశంలోని ఏ రాష్ట్రమూ ఖర్చు చేయడం లేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ముస్లిం అమ్మాయిల విద్యారేటు తక్కువగా ఉందని, వారు కూడా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. చంచల్‌గూడ మైదానంలో ఆదివారం జమియతుల్‌ మొమినాత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీ పిల్లల కోసం సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన 204 రెసిడెన్షియల్స్‌ స్కూళ్లలో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఒక్కో మైనార్టీ విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆకాశంలో సగం.. ఆదాయంలోనూ సగం 
మహిళలు ఆకాశంలో సగమని, ఇంటి ఆదాయంలో నూ సగంగా ఉండాలని హోంమంత్రి పిలుపునిచ్చా రు. ముస్లిం కుటుంబాలు వృథా ఖర్చులు మానుకో వాలని, మహిళలు తమ కుటుంబ ఆదాయం ప్రకార మే బడ్జెట్‌ రూపొందించుకోవాలన్నారు. బాల్యంనుంచే పిల్లల్ని నైతికత, క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పేద మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 20 లక్షలు ఉచితంగా అందిస్తోందని దీన్ని వారంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

అనంతరం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, మతగురువు అల్లామా ఉబెదుల్లాఖాన్‌ మాట్లాడుతూ.. మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితానికి సంబంధించిన ఇస్లామీ షరియత్‌లో కేంద్ర ప్రభుత్వం జోక్యం పట్ల ముస్లిం మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముస్లిం మహిళల హక్కును కేంద్రం కాలరాస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు, లౌకికవాదులంతా కలసి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమురుద్దీన్, జమియతుల్‌ మొమినాత్‌ సంస్థ అధ్యక్షుడు ముఫ్తీ మస్తాన్‌అలీ, హఫెజ్‌ సాబెర్‌పాషా, ముఫ్తీ హసనుద్దీన్‌తో పాటు పలువురు మతగురువులు పాల్గొన్నారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)