రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సమత మరణాన్ని తట్టుకోలేక..
Published on Sun, 12/15/2019 - 09:02
సాక్షి, ఖానాపూర్: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సమత మామ, ఆమె భర్త తండ్రి ఎల్లయ్య(65) గుండెపోటుతో శనివారం ఖానాపూర్ మండలం గోసంపల్లెలోని తన ఇంట్లో హఠాన్మరణం చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఎల్లయ్య సమతపై జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబీకులు పేర్కొన్నారు. అప్పటి నుంచి దిగాలుగా ఉండేవాడన్నారు. దీంతో శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా 20 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందిన ఘటనతో గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
#
Tags