amp pages | Sakshi

రూ.వేల కోట్లతో బాన్సువాడ అభివృద్ధి : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Published on Wed, 12/05/2018 - 15:50

సాక్షి, బాన్సువాడ: ‘గత నాలుగున్నరేళ్లలో రూ.వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.., వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌లో ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా పనులు చేయిస్తున్నా.. నిరుపేదలందరికీ వచ్చే ఏడాదిలోగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తా.. సీసీ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆస్పత్రులు ఇలా అన్ని సౌకర్యాలను కల్పిస్తా..’ అని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.  మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 నియోజకవర్గంలో తాగు, సాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, విద్య, ఉపాధి రంగాల ను మెరుగు పర్చాం. రూ.230 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉచితంగా అందిస్తున్నాం.  పారిశ్రా మికాభివృద్ధికి సీఎం కేసీఆర్, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి బాలానగర్‌–మెదక్‌–బాన్సువాడ–బోధన్‌–భైంసా వరకు జాతీయ ర«హదారిని మంజూరు చేయించారు. ఇప్పటికే మెద క్‌ వరకు రూ.500 కోట్లతో రహదారిని విస్తరిస్తు న్నారు. మెదక్‌ నుంచి రుద్రూర్‌ వరకు మరో రూ. 600 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తాం. రూ.266 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ.273 కోట్లతో పంచాయతీరాజ్‌ రోడ్లు వేయించాం. నేడు బాన్సు వాడ నుంచి అన్ని మండలాలకు డబుల్‌ రోడ్లు వేశాం. ఇంటర్, డిగ్రీ కళాశాలల అభివృద్ధికి రూ. 5.84 కోట్లు, పాలిటెక్నిక్‌ కళాశాల కోసం రూ.2.77 కోట్లు, రుద్రూర్‌లో ఫుడ్‌ టెక్నాలజి కళాశాల కోసం రూ.14 కోట్లు మంజూ రు చేసి నిర్మించాం.

ఎస్సీ, ఎస్టీ   హాస్టళ్ల నిర్మాణం కోసం రూ.11.9 కోట్లు, మిషన్‌ కాకతీయ ద్వారా 65 చెరువుల ఆ«ధునీకరణకు రూ.93.4 కోట్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల కోసం రూ.14.5 కోట్లు మంజూ రు చేశాం. నిజాంసాగర్‌ కాలువ ఆధునీకరణ కోసం రూ.30 కోట్లు, హార్టికల్చర్‌ కోసం రూ.5.01 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పనుల కోసం రూ.99.66 కోట్లు, వ్యవసాయ రంగాభివృద్ధికి రూ.11 కోట్లు, గోదాంల నిర్మాణాలకు రూ.10 కోట్లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు రూ.16 కోట్లు మంజూరు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రులు నిర్మాణాలకు రూ.30 కోట్లు, బాన్సువాడలో వంద పడకల ప్రసూతి ఆస్పత్రి నిర్మాణానికి రూ.17 కోట్లు, పాల శీతలీకరణ కేంద్రం కోసం రూ.2 కోట్లు మం జూరు చేశాం. కొల్లూరు వంతెన నిర్మాణానికి రూ. 2 కోట్లు, బీర్కూర్‌ శివారులో తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.13 కోట్లు మంజూరు చేయించి, తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతున్నాం. మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలకు రూ.10కోట్ల వరకు మంజూరు చేయించాం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌