రేపటి నుంచి ‘లోక్‌సభ’ నామినేషన్లు

Published on Sun, 03/17/2019 - 00:51

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీ చేయనుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సెలవు రోజులు మినహా ఇతర రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 20న హోలీ పండుగ, 24న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. మిగిలిన ఆరు రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 28తో ముగియనుంది. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ