amp pages | Sakshi

‘ఆసరా’.. ఆక్రందన

Published on Tue, 12/16/2014 - 05:02

సాక్షి, బృందం: కాసింత ‘ఆసరా’ కోసం పండుటాకుల ఆగ్రహం పెల్లుబికింది. ఏ దిక్కూలేని అభాగ్యుల ఆక్రందన కట్టలు తెంచుకుంది. పింఛన్ల కోసం సోమవారం జిల్లాలో పలుచోట్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళనబాట పట్టారు. అధికారులు తమకు అన్యాయం చేశారని దుమ్మెత్తిపోశారు. నోటికాడి కూడును లాగేస్తారా..? అని శాపనార్థాలు పె ట్టారు. పింఛన్ ఇస్తారా..చావమంటారా? అంటూ హెచ్చరించారు.

పింఛన్ బాధితులు దేవరకద్ర, కొడంగల్, అయిజ, దామరగిద్ద, బొంరాస్‌పేట తహశీ ల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. దేవరకద్ర  పట్టణంతో పాటు మీనుగోనిపల్లి, బస్వాయపల్లి, గుడిబండ తదితర గ్రామాల నుంచి వచ్చిన వం దల సంఖ్యలో వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ని నదిం చారు. అధికారులను బయటికి పంపించే సి తాళం వేశారు. అనంత రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని మరోమారు ధర్నా కొనసాగిం చారు. పాతబస్టాండ్‌లోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
 
ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందడం లేదని అయిజ ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలను వందలాది మంది లబ్ధిదారులు ముట్టడించారు.  ఒక్కసారిగా వందలమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తరలొచ్చి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా బాధితులు అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అర్హులకు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి మంజూరుచేస్తామని ఎంపీడీఓ నాగేంద్రం లబ్ధిదారులకు హామీఇచ్చారు.
 
పింఛన్ల జాబితాలో తమపేర్లు లేకపోవడంతో పాన్‌గల్ మండలంలోని పాన్‌గల్, బొల్లారం, బుసిరెడ్డిపల్లి గ్రామాల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులను చుట్టుముట్టారు. పాన్‌గల్‌లో 175 మంది, బొల్లారంలో 90మంది, బుసిరెడ్డిపల్లిలో 76మంది అర్హుల పేర్లు జాబితాలో లేవని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆక్షేపించారు. అర్హత ఉన్నా పింఛన్లు ఎందుకు ఇవ్వలేదని ఎంపీడీఓ ఆంజనేయులును నిలదీశారు.
 
పింఛన్‌రాలేదని బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్, చెర్వుముందలితండా, పోలేపల్లి, చిల్మల్‌మైలారం, రేగడిమైలారం, మెట్లకుంట, మూడుమామిళ్లతండా, ఎన్కెపల్లి, సూర్యనాయక్‌తండా తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన వృద్ధులకు అన్యాయం చేయడం తగదని మండిపడ్డారు.
 
దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి చెందిన అర్హులైన వృ ద్ధులు, వికలాంగులు, వితంతువులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి ము ట్టడించారు. పలుసార్లు దరఖాస్తుచేసుకున్నా మంజూరుకు నోచుకోవడం లేదని ఎంపీడీఓ నటరాజ్‌ను నిలదీశారు. పింఛన్ ఇస్తారా..చావమంటా రా? అని ఎంపీడీఓపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఎంపీడీఓ చాంబర్‌లోకి దూ సుకెళ్లేందుకు యత్నించడంతో ఎస్‌ఐ నవీన్‌సింగ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌