వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజ్యాంగ పరిరక్షణకు దేశ వ్యాప్తంగా సభలు: జాజుల
Published on Sat, 01/12/2019 - 04:27
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12న నల్లగొండ, 13న విజయవాడ, 22న ఢిల్లీ, 27న ఒరిస్సాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ 48 గంటల్లో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. జనా భాలో సగానికి పైగా ఉన్న బీసీలను పట్టించుకోకుండా కేవలం ఓట్ల లబ్ధి కోసం బీజేపీ ప్రభు త్వం కుట్ర చేసిందన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సభలకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు.
#
Tags