amp pages | Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం

Published on Thu, 01/18/2018 - 03:54

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ తాగు, సాగు అవసరాల కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనితీరు భేష్‌ అని కితాబిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు, వేగవంతంగా పనులు కొనసాగించడం తదితరాలను ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో 14వ అంతర్రాష్ట్రీయ నదుల అనుసంధానంపై గడ్కరీ అధ్యక్షతన భేటీ జరిగింది. మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ  పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, పనుల పురోగతిని  గడ్కరీ ప్రశంసించారు. భేటీలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన నదుల అనుసంధానంపై చర్చించారు.

గోదావరే శరణ్యం: హరీశ్‌
గోదావరి–కావేరి నదులను తొలి దశలో, మహానది–గోదావరిలను రెండో దశలో అనుసంధానిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రధానాంశాలను లేవనెత్తింది. నీటి లభ్యత, నీటి వనరులు–నీటి తరలింపు, ప్రత్యామ్నాయ మార్గాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి ఉపయోగం–పర్యావరణ అనుకూలత తదితరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మహానది–గోదావరి అనుసంధానాన్నే తొలి దశలో చేపట్టి, ఆ తర్వాతే గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించాలని హరీశ్‌ సూచించారు. కేంద్రం చెబుతున్నట్టుగా ఏటా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నట్టయితే అనుసంధానానికి తెలంగాణ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

‘‘రెండు నదుల మధ్య ఉన్న తెలంగాణను ప్రధానంగా నీటి కోసమే సాధించుకున్నాం. కాబట్టి మాకిది చాలా ప్రాధాన్యాంశం. కృష్ణాలో నీటి లభ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. అందులో 300 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీ మిగులు జలాలు తెలంగాణ హక్కు. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తుది కేటాయింపులు జరపాల్సి ఉంది. కానీ కృష్ణాలో అంత నీరు తెలంగాణకు దక్కడం లేదు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు ట్రిబ్యునల్‌ అనుమతించింది. దాంతో కృష్ణాలో నీటి లభ్యత ఇంకా తగ్గుతుంది. కాబట్టి తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతం కూడా గోదావరి నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

గోదావరి జలాల్లో 954 టీఎంసీలు తెలంగాణ హక్కు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసి ఈ హక్కును పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని మా ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ తదితరాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తోంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం సస్యశ్యామలమవుతుంది. దీనితో రాష్ట్ర పరి«ధిలోనే నదుల అనుసంధానం చేపడుతున్నాం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు కూడా సీతారామ ద్వారా నీరిస్తున్నాం. మొత్తంగా కృష్ణా, గోదావరుల నుంచి తెలంగాణకు 1,700 టీఎంసీలు కావాలి. ఇది పోను ఇంకా మిగులు జలాలుంటే ఇవ్వడానికి మేం సిద్ధం’’అని వివరించారు.

అక్కనపల్లికి ఒప్పుకోం!
అక్కనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలన్న కేంద్రం యోచనపై హరీశ్‌ అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అది సీతారామపై ప్రభా వం చూపుతుంది. పైగా అక్కనపల్లి వద్ద నీటి లభ్యత లేదని మా అధ్యయనంలో తేలింది.  ‘అక్కనపల్లి వల్ల తెలంగాణలో 42 వేల ఎకరాలు, 45 గ్రామాలు ముంపు నకు గురవుతాయి. ఇందుకు మేం సిద్ధం గా లేం. మొదట మహానది–గోదావరిని కలిపి గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి కావేరికీ కలిపి నీరు తీసుకెళ్తే అభ్యంతరం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు ఏటా 3,000 టీఎంసీలు సము ద్రంలో కలుస్తున్నాయా అన్నదానిపై లెక్కతేల్చాలి.

తెలంగాణకు కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ముందు 40 ఏళ్ల సిరిస్‌ ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టిన కేంద్రం, అక్కనపల్లి విషయంలో మాత్రం 110 ఏళ్ల సిరిస్‌ ఆధారంగా లెక్కించి 170 టీఎంసీల లభ్యత ఉందనడం సరికాదు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణ నీటి అవసరాలను పక్కన పెట్టిన అనంతరం మిగులు జలాలను ఇవ్వడంలో అభ్యంతరం లేదు. నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, రాష్ట్ర అధికారుల అధ్వర్యంలో కమిటీ వేసి అధ్యయనం చేయించాలి’’అని భేటీలో కోరినట్టు హరీశ్‌ మీడియాకు తెలిపారు.  ప్రాజెక్టు పనుల పరిశీలనకు రావాల్సిందిగా కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)