amp pages | Sakshi

ఉద్యోగీ.. నువ్వే భరించు..!

Published on Thu, 04/12/2018 - 01:34

షుగర్‌ లెవెల్స్‌ పెరగకుండా ఉండేందుకు వైద్యులు జైడోజింగ్‌ ఇంజక్షన్‌ రాశారు. నెలకు నాలుగు అవసరం. వెల్‌నెస్‌ సెంటర్లలో ఇవ్వడంలేదు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.1,300 పెట్టి బయటి షాప్‌లో కొంటున్నాను. ఇక ఈహెచ్‌ఎస్‌తో ఉపయోగం ఏముంది.   
 – వై.మురళీధర్, రిటైర్డ్‌ ఉద్యోగి 

డాక్టర్లు రాసే మందులివ్వడంలేదు. నాకు 500 ఎంజీ డోసు ట్యాబ్లెట్లు రాశారు. మందులు 1,000 ఎంజీ డోసువి ఇచ్చారు. ఎక్కువ డోసు ఎలా వాడతామని అడిగితే.. ఏమీ చేయలేమని అంటున్నారు.
    – ఆర్‌.వెంకటనారాయణ, ప్రభుత్వ ఉద్యోగి 
– సాక్షి, హైదరాబాద్‌

..వీరిద్దరే కాదు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్ల దుస్థితి ఇదీ. ఉద్యోగుల ఆరోగ్య సేవల పథకాని(ఈహెచ్‌ఎస్‌)కి నిర్లక్ష్య పు జబ్బు పట్టడంతో కనీస వైద్య సేవలూ ఉద్యోగులకు అందే పరిస్థితి ఉండటం లేదు. వైద్య సేవల కోసం వెల్‌నెస్‌ సెంటర్లకు వెళ్లిన వారికి మందులు ఇవ్వడం ఆపేస్తున్నారు. ‘కొన్ని మందులు అందుబాటులో లేవు. అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్‌ మందుల కౌంటర్లలో నోటీసు పెట్టా రు. ఇదేమిటని రోగులు అడిగితే.. తామేమీ చేయలేమని సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవట్లేదు. దీంతో ఉద్యోగులు బయట మార్కెట్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య సేవల పథకాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. 

పర్యవేక్షణ లేక.. 
ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టుకు ప్రత్యేకంగా సీఈవో ఉన్నారు. ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌కు మరో సీఈవో ఉన్నారు. వీరిద్దరి విధుల విష యంలో ప్రభుత్వపరంగా స్పష్టత లేకపోవడం తో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో కె.మనోహర్‌కు ఈహెచ్‌ఎస్‌ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఈహెచ్‌ఎస్‌ నిర్వహణ మరింత అధ్వానంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో వైద్య సేవలు అందడంలేదు. మందుల సరఫరా అరకొరగా జరుగుతోంది. దీంతో వెల్‌నెస్‌ సెంటర్లకు వచ్చే ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గింది. జనవరి వరకు నగరంలోని వెల్‌నెస్‌ సెంటర్లకు సగటు న ప్రతి రోజు వెయ్యి మంది ఉద్యోగులు వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 300కు తగ్గింది. వైద్య సేవలు, మందులు అందుబాటులో లేక పోవడం వల్లే ఈ స్థితి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈహెచ్‌ఎస్‌ను క్రమంగా నిర్వీ ర్యం చేసి పూర్తిగా తొలగించే యత్నాల్లో భాగం గా వైద్యారోగ్య శాఖ వెల్‌నెస్‌ సెంటర్లను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. 

అంతా అయోమయం.. 
ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌ను ప్రారంభించింది. ఈహెచ్‌సీలో 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 మంది పెన్షన్‌దారులు, 32,210 మంది జర్నలిస్టులు నమోదయ్యారు. 2016 డిసెంబర్‌ 17న ఈహెచ్‌ఎస్‌ సేవలు మొదలయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించింది. అదే నెల 19 నుంచి ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వరంగల్, సంగారెడ్డిలో వెల్‌నెస్‌ సెంటర్లను ప్రారంభించింది. ఓపీ సేవలను, పరీక్షలను, మందులను ఉచితంగా అందిస్తోంది. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా అవసరమైన వారికి చికిత్స కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈహెచ్‌ఎస్‌ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఉన్నాయి. అయితే కీలకమైన ఈహెచ్‌ఎస్‌ నిర్వహణ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)