amp pages | Sakshi

తుది కసరత్తు

Published on Tue, 10/02/2018 - 12:56

సాక్షి, మెదక్‌:  జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల నోటిపికేషన్‌ ఎప్పుడు విడుదలైనా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఓటరు తుది జాబితా రూపకల్పనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. తుది ఓటరు జాబితా ప్రకటనకు ఇంకా వారం రోజుల సమయం మిగిలి ఉంది. దీంతో ఎన్నికల సిబ్బంది ఓటరు దరఖాస్తు ఫారాలను పరిశీలన వేగవంతం చేశారు. నియోజకవర్గాల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరో పక్క ఈవీఎంల వినియోగంపైనా రాజకీయపార్టీలు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో ఈ రెండు ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని ప్రజలకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించటంతోపాటు మాక్‌ పోలింగ్‌ చేపడుతున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు  మెదక్, నర్సాపూర్‌లోని 538 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో అధికార యంత్రాంగం ఈవీఎంలపై పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. అలాగే ఓటర్లతో మాక్‌పోలింగ్‌ కూడా నిర్వహించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు.  కరెంటు, తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
త్వరలో పార్టీలతో సమావేశం
జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 538 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వందకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, టాయిలెట్ల సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. 231 పోలింగ్‌  కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. అలాగే మొబైల్‌ఫోన్‌లు పనిచేయని గ్రామాలు 30 ఉన్నట్లు గుర్తించారు. ఆయా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎన్నికల నోడల్‌ అధికారి నగేశ్‌ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. త్వరలో రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తుది ఓటరు జాబితా, ఈవీఎంలపై అవగాహన తదితర అంశాలపై చర్చించనున్నారు. 

 30 నుంచి 39 వయస్సు ఓటర్లే ఎక్కువ
జిల్లాలో 30–39 వయస్సు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వారి తీర్పు కీలకం కానుంది.  జిల్లాలో మొత్తం 3,71,373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 30–39 ఏళ్లు వయస్సు ఉన్న ఓటర్లు 1,13,921 మంది ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,82,464 మంది, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 1,88,909 మంది ఉండగా కొత్తగా నమోదైన ఓటర్లలో ఎంతమంది కలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా  ఓటరు జాబితా సవరణ కోసం 54,731 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సవరణలు చేసినవి 15,333.  సవరణలు చేపట్టాల్సిన దరఖాస్తులు 39,398. తుది ఓటరు జాబితా నాటికి ఓటర్ల సంఖ్య స్వల్పంగా మారనుంది. రాబోయే ఎన్నికల్లో యువ, మధ్య వయస్సు ఓటర్ల తీర్పు కీలకం కానుంది.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)