ఉద్యోగినిపై దాడికి పాల్పడిన యజమాని అరెస్టు

Published on Sat, 08/29/2015 - 19:51

గచ్చిబౌలి (హైదరాబాద్) : ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఓ కంపెనీ యజమానిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాబ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఓ యువతి(22) గచ్చిబౌలి టెలికాంనగర్‌లో గల బ్రిక్‌మోర్ ఇన్‌ఫ్రాలో మూడు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. కాగా బుధవారం కంపెనీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి క్యాబిన్‌లోకి వెళ్లి తనకు పెళ్లి నిశ్చయమైందని, ఉద్యోగం మానేస్తానని చెప్పింది.

వెంటనే ఎండీ శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహంతో.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతారంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి బలవంతంగా 'కంపెనీ ఇచ్చిన జీతం తిరిగి ఇచ్చేస్తాను' అని రాయించుకున్నాడు. భయంతో ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలుపగా వారు శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ