amp pages | Sakshi

చిక్కని చిరుత   

Published on Mon, 07/02/2018 - 19:02

కామారెడ్డి క్రైం : గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం ఇటీవల పెరిగింది. నీళ్లు, ఆహారం కోసం పులులు జనావాసాల్లోకి వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పశువుల పాకల్లోని మూగజీవాలకు రక్షణ లేకుండా పోయింది. చిరుత పులుల దాడుల్లో ఎంతోమంది రైతులు తమ విలువైన పశుసంపదను కోల్పోతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు, ప్రజలు ఒంటరిగా పంటపొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలరోజుల వ్యవధిలోనే ఆరు చోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల ప్రయత్నాలు విఫలం..

పంటపొలాలు, శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులుల కారణంగా తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. భిక్కనూరు మండలంలోని ర్యాగట్లపల్లి, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్‌ గ్రామాల వెంబడి నెల రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తూ ఆయా గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు వలను ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు.

ఇప్పటికే ఆ చిరుత 20కి పైగా మూగజీవాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా గురువారం, శుక్రవారాల్లో వరుసగా రెండు రోజులు పిట్లం, జుక్కల్‌ మండలం కోరన్‌పల్లి తండా శివారులోని పశువుల పాకమీద ఓ చిరుత దాడి చేసింది. ఈ దాడిలో మూడు దూడలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో దూడకు తీవ్రంగా గాయాలయ్యాయి. చిరుత దాడి విషయం తెలియగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. మూడు నెలల క్రితం ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండా, తిమ్మాపూర్‌ గ్రామాల శివారు ప్రాంతాల్లో సంచరించిన ఓ చిరుత హల్‌చల్‌ చేసింది.

అటవీ అధికారులు, గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా యత్నించారు. రెండు రోజులపాటు ఉరుకులు పరుగులు పెట్టించిన ఆ చిరుత చివరికి మృతి చెంది లభించింది. అప్పటికే ఆయా గ్రామాల పరిధిలో రెండుచోట్ల దాడులు చేసి దూడలు, గొర్రెలను హతమార్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటివరకు చిరుత పులులు దాడులు చేసిన ఘటనలన్నీ దాదాపుగా వేకువజాము సమయంలోనే జరిగినట్లు బాధితులు, అటవీ అధికారులు భావిస్తున్నారు. 

చిరుతల పరిస్థితీ దయనీయమే.. 

ఉమ్మడి జిల్లాలో పులుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. మనిషి స్వార్థానికి అడవులు లేకుండాపోతున్నాయి. అడవిలో తిండి దొరక్క ఆహారం కోసం గ్రామాల మీదపడి పశువులు, మేకలను హతమారుస్తున్నాయి. రైతులు తమ పశుసంపదను కోల్పోయి రూ.వేలల్లో నష్టాలకు గురవుతున్నారు. వాస్తవానికి అటవీ ప్రాంతాల్లో వన్యమృగాలకు ఏ మాత్రం ఆహారం గానీ, నీళ్లు గానీ దొరకడం లేదు. వన్య ప్రాణులు జనావాసాల్లోకి ఇస్తున్నాయంటే అది కొందరు స్వార్థ పరుల పుణ్యమేనని చెప్పవచ్చు.

యథేచ్ఛగా అడవులను ఆక్రమిస్తూ వన్యప్రాణుల మనుగడకు ఆటంకాలు కలిగించడం ప్రధాన కారణమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు అటవీశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గత కొద్ది కాలంలోనే ఉమ్మడి జిల్లాలో నాలుగు చిరుత పులులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడ్డాయి. ఏది ఏమైనా చిరుత పులులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు అటవీశాఖ, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)