amp pages | Sakshi

నెరవేరని ఆకాంక్ష

Published on Sun, 11/18/2018 - 14:49

మినీ స్టేడియం ప్రారంభం, డిగ్రీ కాలేజీ నిర్మాణం ఇక్కడి ప్రజలకు కలగానే మారుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులు, క్రీడాకారుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్లుగా ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం, అనంతరం పాలకులు పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో  విద్యార్థులు, క్రీడాకారులకు ఇబ్బందులు షరామామూలుగానే మారుతున్నాయి.   

 సాక్షి, షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల అభివృద్ధి కోసం 1994 సెప్టెంబర్‌ 22న అప్పటి ప్రభుత్వంలోని యువజన క్రీడల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు శంకుస్థాపన చేశారు. పాతికేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఎట్టకేలకు సుమారు నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తయింది. అయినా, నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారే తప్పా సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయడం లేదు.

పాలకులు మినీ స్టేడియం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మినీ స్టేడియంలో నిర్మించిన భవనం ప్రారంభం కాకముందే శిథిలావస్ధకు చేరుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు శిక్షణ తీసుకునేందుకు, తమ ప్రతిభను వెలికితీసేందుకు సరైన వేదిక లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు మినీ స్టేడియాన్ని ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

నత్త నడకన నిర్మాణం 
పట్టణంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం నేటికి కొనసాగుతూ నత్త నడకను తలపిస్తోంది. సుమారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన పనులు నేటికీ పూర్తి కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనే డిగ్రీ కళాశాలను కొనసాగిస్తున్నారు. ఉదయం జూనియర్‌ కళాశాల, మధ్యాç ßæ్నం సమయంలో డిగ్రీ కళాశాలను కొనసాగిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు.
}
కళాశాలకు హాజరయ్యేందుకు సమయానికి బస్సుల సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విద్యతోనే అభివృద్ది సాధ్యమని చెపుతున్న పాలకులు, అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డిగ్రీ కళాశాల భవ న నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యా ర్థులు డిమాండ్‌ చేస్తున్నారు

ఈ పల్లెలు.. ఒకప్పటి నియోజకవర్గ కేంద్రాలు 
గతంలో షాబాద్, మద్దూరు నియోజకవర్గాలు   
షాబాద్‌(చేవెళ్ల): నిజాం కాలంలో ఇప్పటి షాబాద్‌ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతుండేది. 1949లో షాబాద్‌ నియోజకవర్గంగా అవతరించింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కొండా వెంకటరంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత 1954లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కొండా వెంకట రంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి రామారావు చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 1962లో చేవెళ్ల నియోజకవర్గం ఏర్పడింది. షాబాద్‌ మండలాన్ని చేవెళ్ల నియోజకవర్గంలో కలిపారు.

1972లో తిరిగి షాబాద్‌ మండలాన్ని చేవెళ్ల నియోజకవర్గం నుంచి విడదీసి పరిగి నియోజకవర్గంలో కలిపారు. అప్పట్లో పరిగి నుంచి ఒకసారి కమతం రాంరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత అహ్మద్‌ షరీఫ్‌ ఒకసారి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో షాబాద్‌ మండలాన్ని తిరిగి చేవెళ్ల నియోజకవర్గంలో కలిపారు. అయితే, నాటి నుంచి నేటి వరకు షాబాద్‌ మండలం అభ్యర్థుల గెలుపుఓటముల విషయంలో కీలకంగా మారింది.   

అప్పటి మద్దూరు..  
గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. ప్రస్తుత వికారాబాద్‌లో కొనసాగుతున్న మద్దూరు మండలం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1962 సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో మూడు రెవెన్యూ సమితిలు ఉండేవి. మద్దూరు, కోయిలకొండ, ధన్వాడ.  ఈ మూడు రెవెన్యూ సమితిలను కలిపి జనాభా ప్రతిపాదికన మద్దూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ఎస్సీకి రిజర్వ్‌డ్‌ చేశారు. అనంతరం మద్దూరు రెవెన్యూ సమితితో పాటు కొడంగల్‌ రెవెన్యూ సమితిని కలిపి కొడంగల్‌ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.

అయితే, మద్దూరు రెవెన్యూ సమితిలో ప్రస్తుత మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలు ఉండేవి. 1962లో జరిగిన ఎన్నికల్లో నారాయణపేటకు చెందిన ఈ.బసప్ప(కాంగ్రెస్‌)  స్వతంత్ర అభ్యర్థి నర్సింగ్‌రావుపై గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మద్దూరు, కోస్గిని కొడంగల్‌లో కలిపారు. దామరగిద్ద సమితి నారాయణపేట నియోజకవర్గంలో కలిసింది. ఇక జిల్లాల ఏర్పాటు సందర్భంగా కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపేశారు. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాలను వికారాబాద్‌ జిల్లాలో చేర్చారు.   

ఈ పల్లెలు.. ఒకప్పటి నియోజకవర్గ కేంద్రాలు 
పాలకులు  పట్టించుకోవాలి 
పట్టణంలో మినీ స్టేడియం పనులు పూర్తయినా ప్రారంభించడం లేదు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రాంతంలో క్రీడాకార్లుల్లో మంచి ప్రతిభ ఉంది. దానిని గుర్తించి వెలికితీయాల్సిన అవసరం ఉంది.    – స్వాములు, పీఈటీ, షాద్‌నగర్‌ 

హామీలు నెరవేర్చాలి 
ప్రతి ఎన్నికల్లో డిగ్రీ కాలేజీ, మినీ స్టేడియం విషయంలో నేతలు హామీలు ఇస్తున్నారే తప్పా తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సర్కారు వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలి. ప్రస్తుతం విద్యార్థులు, యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   – టీజీ శ్రీనివాస్, వొకేషనల్‌ కళాశాల అధ్యాపకుడు, షాద్‌నగర్‌ 

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)