amp pages | Sakshi

సాహసోపేత సంస్కరణలు రావాలి

Published on Sat, 05/02/2020 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పుల ద్వారా సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకింగ్‌లో ప్రపంచ జాబితాలో భారత్‌ టాప్‌ 20లో చేరేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. కాలం చెల్లిన కార్మిక చట్టాలతో పాటు బ్యాంకుల దివాళాకు సంబంధించిన చట్టాలను సమూలంగా మార్చాలన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా పెట్టుబడుల పట్ల స్థిరమైన, కచ్చితమైన, నమ్మకమైన విధానాలు ఉండాలన్నారు.

మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ 
దేశంలో మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కేటీఆర్‌ లేఖలో సూచించారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీ, కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్కు వంటి వాటికి మద్దతు ఇవ్వాలని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఎగుమతుల్లో ఇతర దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని, ఫార్మా, ఏరోస్పేస్, టెక్స్‌టైల్, లెదర్, ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తూ వాటిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు.

ఎంఎస్‌ఎంఈ రంగాన్ని కాపాడుకోవాలి 
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ)ని కాపాడుకోవాలని కేటీఆర్‌ లేఖలో సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి నేరుగా ఆర్థిక సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలపై ఎంపవర్డ్‌ స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనే అంశాన్ని మరోమారు కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)