నరసింహన్‌పై కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్

Published on Sun, 09/01/2019 - 19:43

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఉన్న అనుభూతులను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌​ కేటీఆర్‌ పంచుకున్నారు. గత 10 ఏళ్లుగా నరసింహన్‌  రాష్ట్రానికి చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ వేదికగా నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  ఇక ముందూ కూడా ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘అనేక సందర్భాల్లో ఎన్నో అంశాలపై నరసింహన్ గారితో సంభాషించే అవకాశం కలిగింది’ అంటూ గతంలో నరసింహన్‌తో కలిసి దిగిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలానే హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తత్రేయకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.   

(చదవండి : తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌)

కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్‌ను ప్రకటించింది.

(చదవండి : తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ