వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
ప్రతీదీ రాజకీయమేనా?
Published on Fri, 09/15/2017 - 02:30
కాంగ్రెస్ తీరుపై మంత్రి హరీశ్ ధ్వజం
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే పరమా వధిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. గురువారం సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది, సంగారెడ్డి మండలాల రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను కాంగ్రెస్ కోర్టు తలుపు తట్టి అడ్డుకుందని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం, పాల మూరు– రంగారెడ్డి తది తర ప్రాజెక్టుల నిర్మా ణానికి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
రైతుల సాగు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.8 వేలు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి రాజకీయాలు అంటగట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా, రామచంద్రాపురం నుంచి జిల్లా సరిహద్దు చిరాగ్పల్లి వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారికి ఇరువైపులా రెండు వరుసల్లో 32 వేల మొక్కలను హరితహా రంలో భాగంగా నాటే కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో శ్రీకారం చుట్టారు. గత ఏడాది కోటి 15 లక్షల మొక్కలు నాటగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కలు నాటాలన్న సంకల్పంతో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించా మన్నారు
Tags