amp pages | Sakshi

హైస్కూళ్లలో వృత్తి విద్య

Published on Fri, 01/31/2020 - 03:18

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 19 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు వారిలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారు 5 శాతం లోపే ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆ వయసు వారు అమెరికాలో 52% మంది, జర్మ నీలో 75% మంది.. దక్షిణ కొరి యాలో 96% మంది వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారే ఉన్నారు. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందుకే 2025 నాటికి దేశంలోని 50 శాతం మంది విద్యార్థులైనా వృత్తి కోర్సు లను అభ్యసించేలా చర్యలు చేపట్టాల్సిందే.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, యూనివర్సిటీల వరకు వృత్తి విద్యా కోర్సులను కచ్చితంగా ప్రవేశ పెట్టా ల్సిందే..’అని నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్‌లో డాక్టర్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో నిపు ణుల కమిటీని నియమించింది. 2019 మే నెలలో తమ డ్రాఫ్ట్‌ పాలసీని ఆ కమిటీ కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్‌ఆర్‌డీ) అంద జేసింది. దానిపై ఎంహెచ్‌ఆర్‌డీ దేశవ్యాప్తంగా నిపు ణులు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిం చింది. వాటిన్నింటినీ పరిగణన లోకి తీసుకొని న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020 ఫైనల్‌ కాపీని అం దుబాటులోకి తెచ్చింది. అందులో వృత్తి విద్యకు సంబంధించిన కీలక సిఫారసులు చేసింది.

ఒకప్పుడు డ్రాపౌట్స్‌ కోసమే..
ఇతర దేశాలతో పోల్చితే వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న యువత దేశంలో చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో వృత్తి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసింది. గతంలో వృత్తి విద్యా కోర్సులను కేవలం డ్రాపౌట్స్‌ కోసమే 8వ తరగతిలో కొనసాగించినా ఇప్పుడు దానిని పాఠశాల విద్య స్థాయి నుంచి కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాల్సిన అవసర ముందని పేర్కొంది. వొకేషనల్‌ సబ్జెక్టులతో 11–12 తరగతులు పూర్తి చేసే వారు ఉన్నత విద్యలోలోనూ వొకేషనల్‌ కోర్సులను చదువుకునేలా అవకాశాలను మెరుగుప ర్చాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల్లో వృత్తి విద్యను దశల వారీగా అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. ప్రాథమి కోన్నత పాఠశాల దశ నుంచే నాణ్యమైన వృత్తి విద్యను అందిస్తూ ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి విద్యా ర్థి ఒక వృత్తి విద్యా కోర్సును చది వేలా చర్యలు చేపట్టాలని వెల్ల డించింది. ఇలా 2025 నాటికి కనీసంగా 50 శాతం మంది వృత్తి విద్యా కోర్సులను చదివేలా చూడాలని వివరించింది. 

రెగ్యులర్‌ కోర్సులతో  పాటు దూరవిద్యలోనూ..
రెగ్యులర్‌ కోర్సులతోపాటు దూ ర విద్యా విధానంలోనూ వీలైన న్ని కోర్సులను అమలు చేసేందు కు చర్యలు చేపట్టాలని ఎన్‌ఈపీ పేర్కొంది. మొత్తానికి వచ్చే పదేళ్లలోగా వృత్తి విద్యను ప్రధా న విద్యగా అన్ని సెకండరీ స్కూళ్ల లో అమలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే సెకండరీ స్కూళ్ల తో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, స్థానిక పరిశ్రమలను అనుసం ధానం చేయాలని, ఉన్నత విద్యా సంస్థలు సొంతంగా లేదా పారిశ్రామిక భాగస్వామ్యంతో వృత్తి విద్యా కోర్సులను నిర్వహించాలని పేర్కొంది. ఉన్నత విద్యలో 2013లో బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ డిగ్రీని ప్రవేశపెట్టినా, అది సరిపోదని పేర్కొంది. అన్ని ఇతర డిగ్రీ కోర్సుల్లో వొకేషనల్‌ కోర్సులు ఉండేలా చూడాలని వెల్లడించింది. 

స్థానిక అవకాశాల మేరకు కోర్సులు..
ఉన్నత విద్యా సంస్థలు సాఫ్ట్‌ స్కిల్‌ తదితర సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని ఎన్‌ఈపీ సిఫారసు చేసింది. దేశంలో ఏయే రంగాల్లో స్కిల్‌ గ్యాప్‌ ఉందో పరిశీలించి, స్థానికంగా ఉపాధి అవ కాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో చూసి అలాంటి కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. టెక్నికల్‌ ఎడ్యుకేషన్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ను సమగ్ర విద్యా విధా నంలో భాగంగా చే యాల్సిందేనని తెలి పింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక భాగస్వా మ్యంతో నేషనల్‌ కమిటీ ఫర్‌ ది ఇంటి గ్రీషన్‌ ఆఫ్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీఐవీఈ) ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందు కు అవసరమై న బడ్జెట్‌ను కూడా కేటాయించాలని పేర్కొంది. విద్యా సంస్థలు అవకాశాలు ఎక్కడెక్క డ ఉన్నాయో ఆలోచించి, పరిశీలించి ఎన్‌సీఐవీఈ సహకారంతో కొత్త కోర్సులను ప్రారంభించాలని స్పష్టంచేసింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)