amp pages | Sakshi

సీజీఎస్టీ నిబంధనల అధికారం కేంద్రానిదే

Published on Sun, 12/17/2017 - 02:33

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) చట్టం కింద ఈ–వే బిల్లులకు సంబంధించి అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ చట్టం కింద ఈ–వే బిల్లుల విషయంలో వ్యాపారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలను హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. సీజీఎస్టీ కింద రాష్ట్రాల మధ్య (ఇంటర్‌స్టేట్‌) జరిగే వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి వ్యాపార, వాణిజ్యాల విషయంలో నిబంధనలు రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహజసిద్ధ అధికారాలేవీ లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కేవలం ఆయా రాష్ట్రాల్లో (ఇంట్రాస్టేట్‌) జరిగే వ్యాపార, వాణిజ్యాల నిబంధనలు రూపొందించే అధికారం మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఉందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

గమ్యస్థానంలో సరుకును అందుకునే వ్యాపారి నుంచి ఈ–వే బిల్లు లేదన్న కారణంతో తమ సరుకును, వాటిని తరలిస్తున్న వాహనాలను ఉభయ రాష్ట్రాల అధికారులు స్వాధీనం చేసుకుంటుండటాన్ని సవాల్‌ చేస్తూ పలువురు వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది.

సరుకు, వాహనాల స్వాధీనం వద్దు...
గమ్యస్థానంలో సరుకు అందుకునే వ్యాపారులు ఈ–వే బిల్లులు సమర్పించలేదన్న కారణంతో ఆ సరుకును, వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీన్ని అడ్డంపెట్టుకుని కొందరు వ్యాపారులు పన్ను ఎగవేసే అవకాశం ఉండటంతో వే బిల్లులకు సంబంధించి అధికారులకు హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సరుకు ఏ రాష్ట్రం నుంచి అయితే తీసుకెళుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఈ–వే బిల్లు లేదా ట్యాక్స్‌ ఇన్వాయిస్‌ లేదా డెలవరీ చలాన్‌ను ఆ సరుకుకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి చూపితే, ఆ సరుకును, వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది.

గమ్యస్థానంలో సరుకులు తీసుకుంటున్న వ్యాపారి నుంచి ఈ–వే బిల్లు రాలేదన్న కారణంతో అతని సరుకు ను, వాహనాలను స్వాధీనం చేసుకోరాదని పే ర్కొంది. వాహనాలను తనిఖీ చేసిన అధికారి ఆ వాహనంలోని సరుకు, ఈ–వే బిల్లు, ట్యాక్స్‌ ఇన్వాయిస్, డెలివరీ చలాన్లకు సంబంధించిన వివరాలను ఏ రాష్ట్రం నుంచి ఆ సరుకులు బయలుదేరా యో ఆ రాష్ట్ర అధికారులతోపాటు గమ్యస్థాన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారులకు కూడా తెలియచేయాలని ఆదేశించింది. అలాగే ఆ సరుకుకు సం రక్షకుడిగా ఉన్న వ్యక్తి వద్ద నుంచి బాండ్‌ తీసుకునేందుకు నిర్దిష్ట నమూనాను తయారు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.  

Videos

నాడు YSR..నేడు జగన్..ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక..

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)