amp pages | Sakshi

డబుల్‌ బెడ్రూం ఇళ్లతో కల సాకారం

Published on Mon, 09/30/2019 - 08:35

ఎప్పుడెప్పుడా అని ఆ తండావాసులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. బల్కంచెల్క తండా గిరిజనులు ఇప్పుడు డబుల్‌ బెడ్రూం ఇళ్ల కానుకను అందుకోవడానికి రెడీ అయ్యారు. జిల్లా మొత్తంలోనే డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలకు ముహూర్తం నిర్ణయించింది ఈ తండాలోనే. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ తండావాసులతో సోమవారం సామూహిక గృహ ప్రవేశాలు చేయించనున్నారు.  

సాక్షి, కల్హేర్‌(నారాయణఖేడ్‌): గిరిజనుల ఐక్యతతో తండా ఆదర్శనీయంగా పేరుగాంచింది. దసరా పండుగ కోసం ప్రభుత్వం ముందస్తు కానుక ఇచ్చింది. జిల్లాలో తొలిసారిగా కల్హేర్‌ మండలం బాచేపల్లి బల్కంచెల్క తండాలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పేదల కల సాకారమైంది. నేడు సామూహిక గృహప్రవేశాలు జరిపేందుకు ముహుర్తం ఖరారైంది. రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ హనుమంతరావు జిల్లా అధికారులతో కలిసి బల్కంచెల్క తండాను సందర్శించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అధికారులను రంగంలోకి దింపారు.

బల్కంచెల్క  తండాలో ప్రభుత్వం 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పట్టణం పుట్టిన గడ్డను అభివృద్ధి చేసేందుకు తండాలోని శ్రీ విశ్వమాళిని జగదాంబ మందిరం ధర్మకర్త, మెడ్చల్‌ జిల్లా రవాణా శాఖ అధికారి మూడ్‌ కిషన్‌ సింగ్‌ నిరంతరం శ్రమిస్తున్నారు. తండాలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రభుత్వం రూ. 2.52 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే కృషితో 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బీజం పడింది. పనులు పూర్తి కావాడంతో లబ్ధిదారుల ఎంపిక చేశారు. కలెక్టర్‌ హనుమంతరావు సమక్షంలో అధికారులు లాటరీ పద్ధతిలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. 

 ఇళ్లను పరిశీలించిన ఆర్డీఓ 
కల్హేర్‌(నారాయణఖేడ్‌): మండలంలోని బాచేపల్లి బల్కంచెల్క తండాలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను నారాయణఖేడ్‌ ఆర్డీఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ పరిశీలించారు. బల్కంచెల్క తండాలో 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేశారు. గృహప్రవేశాల ఏర్పాట్లపై బల్కంచెల్క తండాలోని మందిరం ధర్మకర్త, మెడ్చల్‌ జిల్లా రవాణా శాఖ అధికారి మూడ్‌ కిషన్‌ సింగ్, అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌  రాంసింగ్, జెడ్పీటీసీ నారాయణరెడ్డి, తహసీల్దార్‌ శేఖర్, పీఆర్‌ డీఈఈ ఆంజయ్య, మిషన్‌  భగీరథ డీఈఈ ఫణివర్మ, ఏఈలు శ్రీకాంత్, మాధవనాయుడు, ఈజీఎస్‌ ఏపీఓ నర్సింలు, గిర్దవర్‌ ఎండి.ఖాలీద్, మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ పద్మ బాపురాజు, సర్పంచ్‌ మూడ్‌ లలిత, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిగోండ, రూప్‌సింగ్‌ పాల్గొన్నారు. 

పేదలకు ఇళ్లు 
బల్కంచెల్క తండాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇళ్లు లేని వారికి డబుల్‌ బెడ్రూం కేటాయించారు. తండా ఇతర తండాలకు ఆదర్శంగా నిలుస్తుంది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద సీసీ రోడ్డు నిర్మాణం కోసం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని విన్నవిస్తాం. –మూడ్‌ లలిత కిషన్‌ సింగ్, సర్పంచ్‌ బల్కంచెల్క తండా  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)